ఇందిరా గాంధీ ని ఆదర్శంగా తీసుకోవాలి ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మన న్యూస్: పినపాక మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా భవన్ నందు భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ… ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి ఏకైక మహిళ ప్రధానమంత్రి అని ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో నాలుగవ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేశారని, ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె అని, జోహార్ లాల్ నెహ్రూ మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన మంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేసిన ఒక మహా నాయకురాలని, భారతదేశ ప్రధానిగా దేశ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశాన్ని ముందుకు నడిపిన ఒక మహా నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారని, ఇందిరాగాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కొన్ని రోజుల్లో ఇందిరా గాంధీ పేరుతో ఇందిరమ్మ ఇళ్ళను పేద ప్రజలకు అందజేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ఎవరైనా పాల్పడితే సహించేది లేదని ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఎవరైనా మోసాలకు పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేలినకి నవీన్, పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం, మణుగూరు సింగరేణి ఐ ఎన్ టి యు సి బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు