ఉగ్రవాద దాడులను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: జమ్ము కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్,జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి,సంయుక్త కార్యదర్శులు పెంటకోట మోహన్,దాసం శేషారావు తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియచేసి నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో పంచాయితీ కార్యాలయం నుండి అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు నియోజకవర్గ జనసైనికులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు దాడిలో పర్యాటకుల మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజులపాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ చేసి మరణించిన వారికి నివాళులు అర్పించామని తెలియజేశారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉగ్రవాద దాడులపై చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో గాబు సుభాష్, రామకుర్తి కామేష్,గంగిరెడ్ల మణికంఠ,తలపంటి బుజ్జి,విజయ్,శీరం శ్రీను,పోసిన శ్రీను,గుండం సత్యనారాయణ,అచ్చే వీరబాబు,నియోజకవర్గ నాలుగు మండలాల జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

  • Related Posts

    బంగారు బాల్యం, కిశోర బాలికలు, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణా పై అవగాహన సదస్సు

    మన న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లోని స్థానిక ఈద్గామిట్ట షాదీ ఖానా లో కిషోర్ బాలికలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ కార్యక్రమమును ఉద్దేశించి ICDS సూపర్వైజర్ రిజ్వానా మాట్లాడుతూకిషోర్ బాలికలు ఆరోగ్యం,విద్య, వైద్యం తదితర అంశాల గురించి మాట్లాడారు.సాంత్వన సేవా…

    శ రక్షణ సైనికుల సహాయార్థం రూ.5 లక్షల విరాళందాతృత్వాన్ని చాటుకున్న పీజీ హాస్టల్ యజమాని జ్యోతి కృష్ణ

    మన న్యూస్,తిరుపతి, :-దేశం కోసం విరోచితంగా పోరాడుతున్న సైనికుల సంక్షేమం కోసం తిరుపతిలోని పీజీ హాస్టల్స్ యజమాని జ్యోతి కృష్ణ తన పుట్టినరోజును పురస్కరించుకొని రూ. 5 లక్షల రూపాయల చెక్కు ను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఎన్.సి.సి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బంగారు బాల్యం, కిశోర బాలికలు, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణా పై అవగాహన సదస్సు

    బంగారు బాల్యం, కిశోర బాలికలు, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణా పై అవగాహన సదస్సు

    కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • May 9, 2025
    • 3 views
    కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    నిరుపేదలకు వరం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ -ఎమ్మెల్యే తోట

    • By RAHEEM
    • May 9, 2025
    • 11 views
    నిరుపేదలకు వరం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ -ఎమ్మెల్యే తోట

    సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదు..

    • By RAHEEM
    • May 9, 2025
    • 13 views
    సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదు..