Mana News :- టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఆదివారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం అడిషనల్ ఈవో శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *