ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక మహిళతక్షణమే స్పందించిన స్టేషన్ బ్లూ కోర్ట్ సిబ్బంది

మనన్యూస్,కామారెడ్డి జిల్లా:పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో పిట్లంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకున్న సంఘటనలో,బ్లూ కోర్ట్ డ్యూటీ పోలీసులు తమ ధైర్యంతో ఒక ప్రాణాన్ని కాపాడుతూ ఆదర్శంగా నిలిచారు.పిట్లం గ్రామానికి చెందిన గుణిజి సునీత గారు,కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనోవేదనకు లోనై,గ్రామ శివాలయం సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే 100 నెంబర్‌కు సమాచారం అందించారు.సూచన అందిన వెంటనే స్పందించిన బ్లూ కోర్ట్ సిబ్బంది, జి. రవిచంద్ర కానిస్టేబుల్ గారు మరియు హోంగార్డు మారుతి తక్షణమే ఘటన స్థలానికి చేరుకొని, తమ ప్రాణాలను లెక్కచేయకుండా చెరువులోకి దూకి బాధితురాలిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందేలా చేశారు.ఈ సాహసోపేతమైన చర్యను జిల్లా ఎస్పీ శ్రీ యం.రాజేష్ చంద్ర ips గారు ప్రశంసించి, స్పందించిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న పోలీసు సిబ్బంది, తమ సేవా ధ్యేయాన్ని ఈ సంఘటనలో మరోసారి నిరూపించారని ఎస్పీ తెలిపారు

  • Related Posts

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి