

- కేజీబీవీ విద్యార్థినిల ప్రభంజనం…. మంచి ఉత్తీర్ణత కైవసం…
మన న్యూస్ శంఖవరం అపురూప్ : శంఖవరం
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినిలు 11, 12వ తరగతులలో ప్రతిభను కనబరిచారు.
శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం 11, 12 తరగతుల ఫలితాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపల్ బి. బాల కుమారి మాట్లాడుతూ, 11వ తరగతి ఎంపీసీ విద్యార్థినిలు కొంకిపూడి నవ్య శ్రీ 438/470 మార్కులు సాధించగా, యామిని శ్రీవల్లి 438/470 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
12వ తరగతి ఎంపీసీ విద్యార్థిని కె. బుజ్జమ్మ 748/1000 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రతిభను కనబరిచిన విద్యార్థినీలను శంఖవరం మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ, కేజీబీవీ ప్రిన్సిపాల్ బి. బాలకుమారి, అభినందించారు.