వరికుంటపాడు మండల పరిధిలో సమయపాలన పాటించని అంగన్వాడీ సెంటర్లు

మనన్యూస్:ఉదయం ఎనిమిది గంటలు దాటుతున్న అంగన్వాడి సెంటర్లకు చేరుకోని అంగన్వాడి కార్యకర్తలు,అంగన్వాడీ కార్యకర్తలకు సిడిపిఓ సునీతకు మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం ఉందో సూపర్వైజర్లకే తెలియాలి. అంగన్వాడి సెంటర్లకు పిల్లలు రాకున్నా అంగన్వాడి కార్యకర్తలు సెంటర్లను తమకు ఇష్టం వచ్చినప్పుడు తెరుస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వలస ఉద్యోగాలు చేస్తున్న అధికారులు తమ ఇంటి నుండి బయలుదేరి ఏ మధ్యాహ్నానికో కానీ ఆఫీసులకు రావడం లేదు.. అలాంటప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన సూపర్వైజర్లు ఒకరి తప్పులను ఒకరు కప్పిపుచ్చుకుంటూ రహస్య ఒప్పందాలతో సెంటర్లలో తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం ఇక్కడ సామాన్యమైన విషయం అని సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది అంటున్నారు.. సిడిపిఓ సునీత ఆఫీస్కు రావడానికి మధ్యాహ్నం సమయం అవుతుంటే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్న ఈ కాలంలో ఆమె ఎక్కడ తనిఖీలు చేయగలరని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వరికుంటపాడు మండలంలో మొదటి నుండి ప్రమోషన్ల కోసం పదవీల కోసం పైరవీలు తప్ప సెంటర్లను సక్రమంగా నడిపించాలన్న ఉద్దేశం అక్కడ లేనట్టు కనిపిస్తుంది.. అంగన్వాడి సెంటర్లను సక్రమంగా నిర్వహించాల్సిన సిబ్బంది ఎన్ని పొరపాట్లు చేస్తున్న సిడిపిఓ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..