మీ ఆర్టీసీ బస్సును ఆదరించండి.,కార్గో నిర్వాహకులపై మండిపడ్డ డిపో మేనేజర్,అధిక చార్జీలు వసూలు చేస్తే చర్య లు,బస్టాండ్ శుభ్రం ఎక్కడ,వైఎస్ఆర్ కడప, పోరుమామిళ్ల

మనన్యూస్:ఆర్టీసీ సంస్థ మీసంస్థ..మీసంస్థ నడి పిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో సుఖవంత మైన ప్రయాణం చేయాలని,ఆదరిం చాలని బద్వేలు ఆర్టీసీ డిపో మేనేజర్
ఆర్.సి.జనార్దన్ పేర్కొన్నారు. మంగళవారం పోరుమామిళ్ళఆర్టీసీ బస్టాండ్ లో జరుగుతున్న మరమ్మ తులు,పనులను పరిశీలించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ అందిస్తున్న సేవలపై ఆరాతీశారు.ఈసంర్భం గా ఆయన మాట్లాడుతూ పోరుమామిళ్ళ ఆర్టీసీ బస్టాండ్ ను గత నెల రోజులుగా మరమ్మతులు చేసి అన్ని హంగులతో తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయని,త్వరలో మీకు మంచి సేవలు అందజేసే ఏర్పాట్లు చేస్తామన్నారు.ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం మంచిదని.ఏసమస్య లు వచ్చినా,అవసరం వచ్చినా నాదృష్టికి గాని,కంట్రోలర్ దృష్టికి తెచ్చినా వెంటనే పరిష్కారం చేస్తా మన్నారు.బస్సుల టైమింగ్ మార్చ డం గాని,ఇంకా అదనంగా బస్సులు నడపడం గాని చేస్తామన్నారు.ఆటో లు ఎక్కకుండా ఆర్టీసీ బస్సు లో ఎక్కాలన్నారు.వ్యాపారానికి మూల బిందువు అయిన పోరుమామిళ్ళ లో కార్గో సేవలు ఏర్పాటు చేశామని వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.కానీ ఇక్కడ అతి తక్కువ మంది వినియోగించుకుం టున్నారని,ఎక్కువగా పెంచాలన్నారు.లోటుపాట్లు ఉంటే చెప్పితే సరి దిద్దుకొంటామని చెప్పారు.డోర్ డెలివరీ కూడా చేయించే ఏర్పాటు చేస్తా మన్నారు.బి.కోడూరు కు బస్సు సౌకర్యం కల్పించాలని రామలక్షుమయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఆర్జి పరిశీలించామని రేపటి నుండి బస్సు నడుపు తామన్నారు.

కార్గో సేవల నిర్వాహకులపై ఆగ్రహం
ప్రజలకు అందరికి ఆమోదయోగ్య మైన సరసమైన ధరలకు అందు బాటులో ఉండాలన్న లక్ష్యం తో కార్గో సేవలు ఏర్పాటు చేస్తే ఇష్టారాజ్యంగా నడపటం ఎప్పుడు పడితే అప్పుడు చెప్పాపెట్టకుండా మూసి వేయడం,అధిక చార్జీలు వసూలు చేయడం,ముక్కుపిండీ హమాలి చార్జీలు వసూలు చేయడం ఏమిట ని నిర్వాహకులపై మండిపడ్డారు. మీకు ఇష్టం లేకపోతే వెళ్లిపోండి,వేరే వారికి అప్పగిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనముందే ఎక్కువ పార్శిల్ చార్జీలు వసూళ్లు చేస్తావా అని మండి పడ్డారు.ఫిబ్రవరి,మార్చినెలలోవచ్చిన పార్శిల్స్ ఎందుకు వారికి చేర్చలేదని ఇలాగైతే మానుకోవాలని,మరో సారి ఇదే పునరావృతం అయితే పరిస్థితి వేరేగా ఉంటుందన్నారు.

బస్టాండ్ శుభ్రం ఎక్కడ

బస్టాండ్ లో మరమ్మతులు జరు గుతున్నాయని శుభ్రం చేయకుండా గాలికి వదిలేసి చోద్యం చేస్తున్నావా అంటూ కసువు తోసె నిర్వాహకు లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుండి ఎక్కడ అపరిశుభ్రంగా కని పించిన తక్షణమే తొలగించి కొత్త వారికి అప్పగిస్తామన్నారు.

అరుణాచలం కు ప్రత్యేక బస్సులు

బద్వేలు డిపో పరిసర ప్రాంత ప్రయాణీకుల సౌకర్యార్థం బద్వేలు ఆర్టీసీ డిపో వారు బద్వేలు నుండి బెంగళూరు కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు ఏర్పాటు చేశారని, అరుణాచలంకు వెళ్లేందుకు ఇక్కడ నుండి శనివారం బస్సు నడుపుతున్నామని,వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ అవకాశాన్ని బద్వేల్ మరియు పరి సర ప్రాంత ప్రజలు, పొరుమామిల్ల ప్రజలు వినియోగించుకోవాలన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 2 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 8 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్