ఎక్సలెంట్ భాషా హై స్కూల్ లో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన

మన న్యూస్: కొత్త గూడెం జిల్లా, పినపాక మండలం ఇ.బయ్యారం క్రాస్ రోడ్డు లోని ఎక్స్ లెంట్ భాషా హైస్కూల్లో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇ.బయ్యారం సిఐ వెంకటేశ్వర్ రావ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుని కష్టంగా కాకుండా ఇష్టపడి చదవాలని అన్నారు.ఇష్టపడి చదువే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకొని క్రమశిక్షణతో దానికి అనుగుణంగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కరోనా అనంతరం విద్యార్థులు సెల్ ఫోన్ కు ఎక్కువగా ఆకర్షితులయ్యారని, దానివలన మంచి కంటే చెడు ప్రభావం పిల్లలపై ఉంటుందని అన్నారు.కావున విద్యార్థులను సెల్ఫోన్ వాడకానికి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ వేడుకలకు విశిష్ట అతిధులుగా హాజరైన పినపాక ఎం.ఇ.ఓ. నాగయ్య మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలైన పినపాక, కరకగూడెం మంగపేట మండలాలలోని పేద విద్యార్థులకు ఎక్స్లెంట్ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా సాధారణమైన విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధిస్తున్నారని అన్నారు ఈ వేడుకలకుఇ. బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ కరక గూడెం ఎస్సై రాజేందర్,ఎక్సలెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్ విశిష్ట అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.అనంతరం గత నాలుగు రోజుల నుండి బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించగా విజయం సాధించిన విద్యార్థులకు అతిధుల ద్వారా బహుమతులను అంద చేశారు ఈ వేడుకలలో విద్యార్థుల యొక్క నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తరువాత ఎక్సలెంట్ విద్యా సంస్థల చైర్మన్ యూసఫ్ రెక్టర్లు కలిసి పాఠశాలలోని బోధన, బోధ నేతర సిబ్బందిని శాలువాతో సత్కరించి బహుమతులను అందించారు.ఈ కార్యక్రమానికి ఎక్సలెంట్ విద్యాసంస్థల డైరెక్టర్లు యాకూబ్ షరీఫ్ , నర్సారెడ్డి , నరేంద్ర గారు, ప్రిన్సిపాల్ సురేష్ సీనియర్ ఫ్యాకల్టీ వలసల మోహన్ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) డోంగ్లీ మండలంలోని సిర్పూర్–మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను బాన్సువాడ సబ్‌ కలెక్టర్ కిరణ్మయి స్వయంగా సందర్శించి తనిఖీ చేశారు.ఎన్నికల నియమావళిలో భాగంగా మద్యం,నగదు తదితరాలను అక్రమంగా తరలించకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని…

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    • By RAHEEM
    • December 9, 2025
    • 3 views
    చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం