4.76 కోట్లు పలికిన ఇందిరప్రియదర్శిని మార్కెట్,కమిషనర్ ఎన్.మౌర్య

మనన్యూస్,తిరుపతి:నగర పాలక సంస్థకు సంబంధించిన ఇందిరాప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కు నిర్వహించిన వేలంలో 4.76 కోట్ల రూపాయలతో మోహన్ బాబు దక్కించుకున్నారని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 22 వ తేదీ ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సమక్షంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఇందులో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ను జి. ఎన్. మోహన్ బాబు 4,76,00,000 రూపాయలకు, రామచంద్ర గుంట కట్ట మార్కెట్ ను పి. యస్.మునిరాజ బాబు 2,34,000 రూపాయలకు, జంతు వధశాలను పి.యస్.మునిరాజ బాబు 4,00,000 రూపాయలకు, గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు, మాస్క్ రోడ్డు వగైరా తిలక్ రోడ్డు మార్టినల యందు హరే రామ హరే కృష్ణ గుడి రోడ్డు ఇరు ప్రక్కల, కపిల్ తీర్ధం జంక్షన్ యందు పార్కింగ్ స్థలములను బి.విష్ణు వర్ధన్ 33,00,030 రూపాయలకు, శ్రీనివాసం ఏరియా ఎదురుగా భారతీ బస్ స్టాండ్ పార్కింగ్ స్థలమును యం.కె.సురేష్ కుమార్ 10,40,000 రూపాయలకు, జి.ఎన్. మరియు జి.యస్.పార్కింగ్ స్థలమును యం.కృష్ణమూర్తి 3,35,599 రూపాయలకు పాడి హెచ్చు పాటదారులుగా నిలిచారు. కాగా వినాయక సాగర్ పార్కుకు ముగ్గురు డిపాజిట్ చెల్లించగా, ఒకే సీల్డ్ టెండర్ వచ్చింది. డబ్బులు చెల్లించి బహిరంగ వేలంలో ఎవ్వరూ పాల్గొననందున, సీల్డ్ టెండర్ లో సంవత్సరానికి 18 లక్షల రూపాయలు కోడ్ చేశారు. నగరపాలక సంస్థ నిర్ణయించిన అద్దె కంటే తక్కువ కావడంతో వాయిదా వేశారు. వినాయక సాగర్ పార్కులో “గేమ్ జోన్”ను, బొంతాలమ్మ గుడి వద్ద నిర్మించిన షాపింగ్ కాంప్లెక్సు రెండవ అంతస్తు హాలుకు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ (ఇందిరా మైదానము) కు వేలంలో ఎవ్వరూ పాల్గొనలేదు. నగరపాలక సంస్థ నియమ నిబంధనల మేరకు కాంట్రాక్టర్లు నడుచుకోవాలని కమిషనర్ ఎన్.మౌర్య సూచించారు. ఈ వేలం పాటలో డిప్యూటీ కమిషనర్ అమరాయ్య, రెవెన్యూ ఆఫీసర్స్ సేతుమాధవ్, రవి, తదితరులు ఉన్నారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి