Mana News :- తిరుపతి, నవంబర్ 12,
(మన న్యూస్ ) తిరుపతి అలిపిరి కపిలతీర్థం రోడ్డు నందలి వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మరియు దివ్యారామం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80సంవత్సరాలు పైబడిన వాకర్స్ కు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తిరుపతిలోని 15 పార్కులలో దివ్యారామం పార్క్ కూడా ఒకటని, ప్రతిరోజు వాకింగ్ చేస్తూ యువతకు ఆదర్శ్యం గా నిలుస్తున్న దివ్యారామంలో ఉన్న వయసు 80 పైబడిన ఉత్తమ వాకర్స్ డా. సురేష్ , మొగిలప్ప నాయుడు, వెంకరమణ రెడ్డి ను సన్మానించడం చాల ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, దివ్యారామం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఆదం దశరథరామి రెడ్డి, హేమచంద్ , ఎల్లయ్య , డా. నారప్ప రెడ్డి ,రామచంద్ర రెడ్డి , పతంజలి యోగ సమితి నాయకులు కైలాష్ సింగ్ , ఓటరు కృష్ణ, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *