డాక్టర్ వైయస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తల్లిదండ్రులు- ఉపాధ్యాయులు సమావేశం


మన న్యూస్ వెదురుకుప్పం :- వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా జరిగింది. కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల తో పాటు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రధాన భూమిక పోషిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ బి. అన్నపూర్ణ శారద ఈ కార్యక్రమంలో అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలోఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమొ, తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే కీలకమైనదని ఆమె అన్నారు. తల్లిదండ్రులు తరచుగా కళాశాలకు విచ్చేసి తమ పిల్లలు కళాశాలకు సక్రమంగా వస్తున్నారా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం అని ఆమె అన్నారు. ప్రస్తుత ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం అతి ముఖ్యమైనదని, కళాశాలలో ఎంపీ లాడ్స్ ఫండ్స్ తో మంచి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు అయిందని దానిని విద్యార్థులు సక్రమంగావినియోగించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె అన్నారు. పేరెంట్స్ టీచర్స్ కమిటీ కోఆర్డినేటర్ వి. ప్రభాకరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు తరచుగా అధ్యాపకులతో నేరుగా గాని లేదా మొబైల్ ద్వారా గాని మాట్లాడుతూ వాళ్ళ పిల్లల హాజరు గురించి మరియు చదువులో వారి అభివృద్ధి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. మనదేశంలో అపారమైన యువత ఉందని, ఆ యువత సక్రమంగా విద్యాబుద్ధులతో అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసన్న లత మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యావంతులు కాకపోయినా వారి పిల్లలు ఇంట్లో ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో చదువుతున్నారా లేదా అని గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ వెంకటేశు మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులని అందువల్లనే వారు పిల్లలకు చిన్నతనం నుంచి పెద్దలను, గురువులను గౌరవించడం నేర్పాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు మాట్లాడుతూ మా ప్రాంతంలోనె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉండడం మా అదృష్టమని అన్నారు. గతంలో డిగ్రీ కళాశాలలో చదవాలంటే వ్యయ ప్రయాసాలకు ఓర్చి పిల్లలు చాలా దూరం వెళ్లవలసి వచ్చేదన్నారు. పిల్లల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, మంగళ గౌరీ మొదలగువారు ప్రసంగించారు.
ఈ సమావేశంలో ఇతర అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు