

మన న్యూస్,సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట్రంలో గత అయిదేళ్ల అస్తవ్యస్త పాలనలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు.ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల మెరుగుదలకు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలకు కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది రూ.27.39 కోట్లు. వచ్చే విద్యాసంవత్సరంలో రూ.85.84 కోట్లు ఖర్చుచేయనున్నారు.మంత్రి లోకేష్ ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.విద్యాశక్తితో సామర్థ్యం పెంపుదలకు చర్యలు,ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎపి మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, హైస్కూలు ప్లస్ స్కూళ్లలో విద్యనభసిస్తున్న 2లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులను ప్రభుత్వం పంపిణీ చేసింది.
బోధనా విధానాన్ని మెరుగుపర్చేందుకు జిల్లా, రీజనల్ స్థాయిలో అకడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎజిఎంసి)లను ఏర్పాటుచేశారు.ఐఐటి మద్రాసులో శిక్షణ పొందిన నిపుణులైన అధ్యాపకులతో ప్రతిరోజూ సాయంత్రం 4నుంచి 5గంటల వరకు జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మెళుకువలు నేర్పుతున్నారు.క్రమం తప్పకుండా పేరెంట్ టీచర్స్ సమావేశాలను నిర్వహిస్తూ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. రోజువారీగా విద్యార్థుల పనితీరు, హోం వర్క్, గైర్హాజరు వివరాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నారు.మౌలిక వసతులపై కళాశాలల వారీగా స్టార్ రేటింగ్ ఇచ్చి, మెరుగుదలకు చర్యలు చేపట్టారు.వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు,పన్నెండేళ్ల తర్వాత తొలిసారిగా విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు.జాతీయ విద్యావిధానం -2020కి అనుగుణంగా 2025-26 విద్యా సంవత్సరంలో నూతన పాఠ్య ప్రణాళిక అమలుకు రాష్ట్ర-స్థాయి సబ్జెక్ట్ కమిటీ కసరత్తు చేస్తోంది. సైన్స్ సబ్జెక్టులకు ఎన్సిఇఆర్టి, పోటీ పరీక్షల సిలబస్తో సర్దుబాటు చేస్తూ ఇంటర్ 2వ సంవత్సరం సిలబస్ కూడా తగ్గించేలా నూతన పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి అసెస్మెంట్ ప్రక్రియను మరింత సామర్థ్య ఆధారితంగా మార్చడానికి వీలుగా MCQలు, చిన్న ప్రశ్నలపై ఎక్కువ దృష్టి ఉంటుంది.వచ్చే విద్యా సంవత్సరం నుండి EAMCET/NEET పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డ్లు, పుస్తకాలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందజేస్తారు. ఒకేషనల్ విద్యార్థులకు డ్యూయల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అమలుకు చర్యలు చేపట్టారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET) సహకారంతో ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టారు. ఒకేషనల్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంచడానికి బోర్డు సర్టిఫికేషన్తో పాటు NSQF సర్టిఫికేషన్ కోసం ప్రమాణాలను రూపొందించారు.మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
రాష్ట్రంలో 353 హైస్కూల్ ప్లస్ స్కూళ్లలో నడుస్తున్న కళాశాలల పనితీరును మెరుగుపర్చేందుకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్య పరిధిలోకి తీసుకురానున్నారు.మన బడి మన భవిష్యత్తు పథకం కింద రాష్ట్రంలో 447 కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 307.76 కోట్ల అంచనాలతో పనులను ప్రతిపాదించగా, ఇందుకోసం ఇప్పటివరకు రూ.169.69 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ నిధులతో ప్రభుత్వ కళశాలల్లో తాగునీటి వసతి, టాయ్ లెట్ల నిర్మాణం, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల ఏర్పాటు,ఫర్నీచర్, ప్రధాన మరమ్మతులు, బ్లాక్ బోర్డులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపుదలకు వెనుకబడిన విద్యార్థులకు మెంటర్ అమలుచేస్తున్నారు.ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత పెంపుదలకు గత ఆరునెలలుగా మంత్రి లోకేష్ చేపట్టిన నిర్మాణాత్మక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయి సంస్కరణల అమలుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
