శెట్టిపల్లిని హైటి హబ్ గా తీర్చిదిద్దుతాం,, ఏం ఎల్ ఏ శ్రీనివాసులు,,జనవరి 8న శెట్టిపల్లి వాసులకు ప్రొసీడింగ్స్ ఇస్తాం కలెక్టర్ వెంకటేశ్వర్

మనన్యూస్:తిరుపతి శెట్టిపల్లిలో సోమవారం రెవెన్యూ సదస్సు జరిగింది.ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,కలక్టర్ వెంకటేశ్వర్,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య,రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.ఏళ్ల తరబడి భూ సమస్యను పరిష్కరించడం లేదని రైతులు,ప్లాట్ దారులు సదస్సు దృష్టికి తీసుకువచ్చారు.అలాగే రోడ్లు,తాగునీరు,డ్రైనేజీ,వీధి దీపాలు సరిగా లేవని శెట్టిపల్లివాసులు తెలిపారు.శెట్టిపల్లి భూసమస్య ను నూతన సంవత్సరంలో పరిష్కారం కావటం ఖాయమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు శెట్టిపల్లి సమస్య పరిష్కరించి అభివృద్ధి పరచాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా శెట్టిపల్లిని ఐటి హబ్ గా తీర్చిదిద్దునున్నట్లు ఆయన చెప్పారు.రైతులు, ప్లాట్ దారులు పట్టువిడుపులతో సమస్య పరిష్కారానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.శెట్టిపల్లిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నుంచి తప్పించి తుడా లో కలిపేందుకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.శెట్టిపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.తనకు ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు ఇచ్చిన శెట్టి పల్లెవాసుల మరొక్కసారి కృతజ్ఞతలు తెలిపారు.కాగా జనవరి 8వ తేదిన ఆరు లే అవుట్ లకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్లు కలక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. నూతన సంవత్సరంలో 85శాతం సమస్య పరిష్కారం కావటం ఖాయమని ఆయన శెట్టిపల్లివాసులకు ఆయన భరోసా ఇచ్చారు. రైతులకు ఫ్లాట్స్ కోసం 230ఎకరాలు కేటాయించినట్లు ఆయన తెలిపారు.కాలువకు దక్షణం వైపు రైతులకు కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వానికి 95 ఎకరాలు, తుడ కు 65 ఎకరాలు కేటాయిస్తామని ఆయన తెలిపారు.ఎంజాయ్ మెంట్ లో ఉన్న వారికి ఒకటిన్నర సెంటు భూమి కచ్చితంగా అందిస్తామని ఆయన తెలిపారు.మల్టిపుల్ రిజిస్ట్రేషన్ లు ఎన్ని జరిగాయో రెవెన్యూ అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.అబ్జెక్షన్ పరుంబోకు లో ఉన్న వారికి ఎటువంటి సాయం అందించలేమని ఆయన స్పష్టం చేశారు.అయితే త్వరలో సిఎంఓ అధికారులతో సమావేశం అనంతరం పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తామన్నారు.తుడ ప్లాట్స్ అమ్మి అభివృద్ధి చేస్తాం:కమీషనర్ మౌర్య శెట్టిపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పనకు తుడ చర్యలు తీసుకుంటుందని కమిషనర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు.శెట్టిపల్లిలో తుడ కు కేటాయించిన భూమిలో ప్లాట్స్ వేసి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో అభివృద్ధి చేస్తామన్నారు. శెట్టిపల్లిలో ఆరుగురితో పారిశుద్ధ్య పనులు నిత్యం చేయించనున్నట్లు ఆమె తెలిపారు. తెలుగుగంగ నీళ్లు రాత్రి 9గంటల లోపు వదిలే లా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.డ్రైనేజీ కాలువలు, వీధి దీపాల సమస్యలను స్వయంగా ఆమె శెట్టిపల్లిలో పర్యటించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సూర సుధాకర్ రెడ్డి,బాలముని కృష్ణా,సురేష్, అముదాల తులసీ,జనసేన నాయకులు రామకృష్ణా,రాజా రెడ్డి,బిజేపీ నాయకులు వరప్రసాద్,సిపిఎం నాయకులు జయచంద్ర, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//