కారు లో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్, వివరాలు వెల్లడించిన పెద్దాపురం డిఎస్పి డి శ్రీహరి రాజు

మన న్యూస్:ఏలేశ్వరం ఒరిస్సా ప్రాంతం నుండి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన కే ఏ 51ఎంహెచ్187 నెంబర్ గల స్కోడా కార్ లో 10.280 కేజీలు గంజాయిని అక్రమంగా.తరలిస్తుండగా ఏలేశ్వరం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కారులో తలుస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరు పరిచినట్లు పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు తెలిపారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.పట్టుపడ్డ గంజాయి బెంగళూరు విద్యాధరపురం లో వరదరాజ నగరం లో నయాజ్ పాషా అనే వ్యక్తి ఒరిస్సా నుండి బెంగళూరుకు తన భార్యతో 16 జాతీయ రహదారిపై వెళ్తూ ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం సి పి ఎఫ్ ఫ్యాక్టరీ కి ఎదురుగా కారును ఆపి తన భార్యని కొడుతుండగా చూసిన స్థానిక ప్రజలు ఏలేశ్వరం పోలీసు కి సమాచారం అందించడంతో వెంటనే పెద్దాపురం డిఎస్పి డి శ్రీహరి రాజు ఆదేశాల మేరకు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు నేపథ్యంలో ఎస్సై రామలింగేశ్వర రావు తన సిబ్బందితో హుటా హుటిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించగా నయాజ్ పాషా అనుమానస్థితిలో ఉండగా కారును తనిఖీ నిర్వహించగా ఆ కారులో 10.280 కేజీల గంజాయి గుర్తించినట్టు తెలిపారు నాయజ్ పాషా వద్ద 65 వేల రూపాయలు మొబైల్ ఫోన్ న్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ముద్దాయికి గంజాయిని సరఫరా చేసిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సమంత కంహార్ ని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు గొడవ లో తీవ్రంగా గాయపడిన అతని భార్యని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు ముద్దాయిని అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు. డిఎస్పి శ్రీహరి రాజు మాట్లాడుతూ యువత గంజాయి కి బానిసై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గంజాయి తాగుతూ గంజాయి అమ్ముతున్న యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఇకనైనా గంజాయి కి దూరంగా ఉండాలని లేకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. గంజాయిని పట్టుకున్న కృషి చేసిన సిఐ బి సూర్య అప్పారావుని,ఏలేశ్వరం పోలీస్ ఎస్ఐ రామలింగేశ్వరరావుని, సిబ్బందిని ఈ సందర్భంగా డిఎస్పి శ్రీహరి రాజు అభినందించారు

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా