ఉదయగిరి అక్టోబర్ 15(మన ధ్యాస న్యూస్) :////
ఉదయగిరి మండల కేంద్రమైన స్థానిక ప్రొబిషన్ మరియు ఎక్సేంజ్ స్టేషన్లో బుధవారం జరిగిన సమావేశంలో ఉదయగిరి స్టేషన్ పరిధిలోనే నాలుగు మండలాలైన, ఉదయగిరి, దుత్తలూరు, మర్రిపాడు, సీతారాంపురం, మండలాల a4 షాప్ లైసెన్స్ దారులు మరియు నౌకరి నామదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మణస్వామి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన “ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్”ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని మద్యం బాటిల్లను స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్ల నాణ్యతను తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే ఆమధ్యం కల్తీ మధ్యమా లేదా ప్రభుత్వం తయారుచేసిన మధ్యమా, అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చని అలాగే ఈ యాప్ను కస్టమర్లు కూడా మద్యం యొక్క నాణ్యతను నిర్ధారణ చేయడానికి ప్రతి ఒక్క వినియోగదారుడు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. అలాగే షాపుల్లో మద్యం విక్రయించే నౌకరణ మదారుడు తప్పనిసరిగా ఈ యాప్ ద్వారా మద్యం బాటిలను స్కాన్ చేసిన తర్వాత మాత్రమే మద్యం బాటిల్స్ లను విక్రయించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని.. అక్రమంగా మద్యం అమ్మితే 9440902522 ఈ నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బెల్ట్ షాపులకు సంబంధించిన సమాచారం అందించిన వారి వివరములు గోపయ్యంగా ఉంచుతామని సెలవిచ్చారు. ఎవరైనా అనాధికారంగా బెల్టు షాపులు నడిపిన ప్రోత్సహించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎక్సేంజ్ సబ్ ఇన్స్పెక్టర్. బి. దీప్తి క్రాంత్, ఎక్స్చేంజ్ సబ్ ఇన్స్పెక్టర్, పి శ్రీనివాసరావు, మరియు తోటి సిబ్బంది పాల్గొన్నారు.









