

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సూపర్డెంట్ గా డాక్టర్ వి రమేష్ పదవీ బాధ్యతలను చేపట్టారు. గతంలో ఉన్న డాక్టర్ శైలజ కడియం
ప్రభుత్వ ఆసుపత్రి కి బదిలీపై వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, కార్యాలయ సిబ్బంది డాక్టర్ వి రమేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి బాటలో నడుపుతానని, రోగులకు అందరికీ అవసరమయ్యే డాక్టర్లను అందుబాటులో ఉండేలాగా చేస్తానని, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న స్ఫూర్తిని ప్రజలందరికీ అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది సహాయ సహకారాలతో ఆసుపత్రిని ఒక మంచి గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.