ఎవరు లేని సమయంలో చెప్పా పెట్టకుండా ఫీజు పీకేసిన లైన్ మ్యాన్..వినియోగదారునికి ముందస్తు సమాచారం ఇవ్వని లైన్ మ్యాన్..రోజురోజుకు పెరుగుతున్న లైన్ మ్యాన్ ఆగడాలు../////

ఉదయగిరి మన న్యూస్ ప్రతినిది నాగరాజు, ఆగస్ట్ 28 :///

ఉదయగిరి మండల పరిధిలోని ప్రతి పల్లెలో ప్రతి ప్రాంతంలో ప్రధాన సమస్యగా మారిన కరెంటు లైన్ మ్యాన్ ఆగడాలు రోజురోజుకీ అతిక్రమిస్తున్నాయి. వారి యొక్క దుస్సాహసానికి ప్రజలు భయపడుతూ.. నెల వచ్చేసరికి కరెంట్ బిల్లు కట్టడానికి అవస్థలు పడుతూ కరెంట్ బిల్లు కట్టకపోతే ఫీజు పీకి వేస్తారేమో అని పేదవాడు భయాందోళనకు గురవుతున్నారు. రోజు కూలి పని చేసుకునే వ్యక్తి నెల వచ్చే సరికి కరెంట్ బిల్లు కట్టలేదని కరెంటు లైన్ మెన్ వచ్చి చెప్పా పెట్టకుండా ఫీజ్ పీకేసి వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న చిన్న పిల్లల పరిస్థితి ఏంటి అని నిరుపేదలు బాడుగ ఇండ్లలో ఉండేటువంటి వారు లైన్ మ్యాన్ వచ్చి ఫీజు పీకేశాడు అన్న సంగతి ఆ ఇంటి యజమానికి తెలిస్తే ఎక్కడ ఇల్లు ఖాలీ చేయమంటాడో ,అని ఆవేదన చెందుతున్నారు. నెల వస్తుందంటే భయం ఒక పూట అన్నమైన మానుకొని కరెంట్ బిల్లు కోసం డబ్బులు దాచి పెట్టకపోతే చీకటి ఇంట్లో పసిపిల్లలను పెట్టుకొని ఎక్కడ చీకటిలో ఉండవలసి వస్తుందో అన్న భయం ప్రతి పేదవాడి గుండెల్లో గుబేలు మనిపిస్తుంది. లైన్ మ్యాన్ ఎప్పుడు వస్తాడో అని భయం విషయం ఏంటి అంటే విద్యుత్ చట్టాల మీద అవగాహన లేకపోవడమే ఒక లైన్ మ్యాన్ తాను చేస్తున్న పనిమీద కనీస అవగాహన తనకే పూర్తి అవగాహన లేకపోవడం తనపై అధికారి కూడా తనకి తెలియ చెప్పకపోవడం వల్ల లైన్ మ్యాన్ విద్యుత్తు వినియోగదారునికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన ఇష్టానుసారంగా ఫ్యూజ్ పీకేసి చెప్పకుండా వెళ్లిపోవడం సరి అయినది కాదని గ్రామస్తులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు కనీసం గృహ నిర్వాహకుని పిలిచి కరెంట్ బిల్లు ఎందుకు కట్టలేదని కానీ ఎప్పుడు కడతావు అని వెళ్లి ఇప్పుడైనా కట్టి రండి అని అయినా చెప్పకుండా అర్ధాంతరంగా ఫీజు పీకి వేసి వెళ్లిపోవడం చాలా విచారకరం ఇలా చేసిన లైన్ మ్యాన్ మీద సంబంధిత అధికారుల మీద కూడా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003.56.ప్రకారం ముందస్తు గా వినియోగదారునికి నోటీసు ఇవ్వాలి అలా నోటీసు ఇవ్వకుండా ఫీజు తొలగించే అధికారం లైన్ మ్యాన్ కి కానీ ఏ.ఈ కి కానీ డి.ఈ కి కానీ లేదు ఒకవేళ వినియోగదారుడు ఇంట్లో లేని సమయంలో అతనికి స్పీడ్ పోస్ట్ ద్వారా విద్యుత్తుకు సంబంధించిన నోటీసు పంపించవలసి ఉంటుంది నోటీసు పంపించిన కూడా 15 రోజులు గడువు ఇవ్వవలసి ఉంటుంది 15 రోజులు గడిచిన తర్వాత కూడా వినియోగదారుడు స్పందించకపోతే ఎలక్ట్రిసిటీ అధికారి వచ్చి ఫీజు తొలగించే అధికారం కలిగి ఉంటాడు ఇలా కాకుండా లైన్ మ్యాన్ ఫీజు పీకేసి వెళ్లినట్లయితే అతని మీద అతనిపై అధికారులు మీద ఇండియన్ పీనల్ కోడ్. సెక్షన్188. సెక్షన్ 447 సెక్షన్ 448 సెక్షన్ 506 ప్రకారం వారి మీద క్రిమినల్ కేసు పెట్టే అధికారం వినియోగదారునికి ఉంటుంది అలాగే వినియోగదారుడు తనకు పరువు నష్టం జరిగినందుకు కన్స్యూమర్ కోర్టులో దావా వేసుకునే హక్కు వినియోగదారులుకుంటుంది పరువు నష్టం జరగడానికి కారకులైన ఎలక్ట్రిసిటీ అధికారులు దగ్గర నుండి 10 లక్షల వరకు నష్టపరిహారం పొందే హక్కు వినియోగదారుడు కలిగి ఉంటాడు వినియోగదారుడే రాజు అని 2019 ప్రకారం వినియోగదారులు అక్కు కలిగి ఉంటారని తెలియజేయడం జరిగింది. ఇకపై లైన్మెన్ యొక్క ఆగడాలు అతిక్రమించకుండా పై స్థాయి అధికారులు చర్యలు తీసుకుని ప్రజల పట్ల అంకితభావంతో స్నేహపూర్వక నడవడికను అవలంబించుకునే విధంగా తగు చర్యలు తీసుకుంటారని పేద ప్రజలు కోరుకుంటున్నారు.

  • Related Posts

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నాయకపోడు కులస్థులకు తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని దీంతో తమ విద్యార్థుల చదువులకుఆటంకాలుఏర్పడుతున్నాయని నాయకపోడు కులస్థులు రాస్తారోకో చేపట్టారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో బుధవారం నాయకపోడు…

    డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////

    మర్రిపాడు : (మన ద్యాస న్యూస్),ప్రతినిధి నాగరాజు: /// డిసిసి చైర్మన్ మెట్టకురు ధనుంజయ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించిన మర్రిపాడు మండలం భీమవరం సొసైటీ అధ్యక్షులు ఎర్రమల చిన్నారెడ్డి మరియు బోదవాడ సొసైటీ అధ్యక్షులు వనిపెంట సుబ్బారెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ