మండపం లో సత్య సింహ షుగర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం..

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి:- తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం, వివరించలేని బరువు తగ్గడం, అధిక అలసట, దృష్టి మసకబారడం, గాయాలు నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మరియు తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం వంటివి లక్షణాలు కలిగి ఉంటే వైద్యులను సంప్రదించాలని ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ చిత్రారెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామంలో అన్నవరం నకు చెందిన సత్య సింహ షుగర్ ఆసుపత్రి యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది గ్రామీణవాసులు వైద్య సేవలు పొందారు. ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ చిత్రారెడ్డి వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు చిత్రరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణవాసులకు సంపూర్ణ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.షుగర్ వ్యాధి (మధుమేహం) నివారణకు లేదా నియంత్రణకు సులభ చికిత్స అనేది లేదు, కానీ కొన్ని జీవనశైలి మార్పులు మరియు వైద్య పర్యవేక్షణతో దానిని నిర్వహించవచ్చని, సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ, మరియు వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు అన్నారు. అనంతరంఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి వెంకట్రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణవాసులకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్య సింహ సుగర్ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, రమణ, ఆశ, మాధవి, ఆసుపత్రి యాజమాన్య సిబ్బంది నాని, లోవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///