భూ సేకరణకు రైతులు సహకరించాలి..బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తి పోతలపథకం పైప్ లైన్ ఏర్పాటు కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో వడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల రైతులతో ఆమె సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ..నాగమడుగు ఎత్తిపో తల పథకం పైప్ లైన్ ఏర్పాటు కోసం రైతులు భూమిని ఇచ్చి సహకరిం చాలని అన్నారు.రైతుల అభిప్రాయం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు.ఈ సమావేశంలో వడ్డేపల్లి గ్రామానికి చెందిన రైతు నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ..పైపు లైన్ కోసం రైతులు ఇచ్చే భూమిపై రైతులకు హక్కులు ఉండాలని అన్నారు.గతంలో భూ సేకరణ జరిగినప్పుడు రైతులకు ఎకరాకు 17 లక్షల రూపాయలను చెల్లించారని ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఎకరాకు 30 లక్షల రూపాయలను ఇవ్వాలన్నారు.ఈ ప్రాజెక్టు వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్నందున వడ్డేపల్లి పేరు పెట్టాలన్నారు.ఈ సమావేశంలో తహసిల్దార్ భిక్షపతి,రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు,సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్,సర్వేయర్ శ్రీకాంత్,రైతులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..