(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్,నియోజవర్గ వైసీపీ నాయకులు బదిరెడ్డి గోవింద్ బాబు ఆధ్వర్యంలో సుమారు 150 మంది ఏలేశ్వరం మండలానికి చెందిన సర్పంచులు,మాజీ సర్పంచులు,మాజీ కౌన్సిలర్లు,మాజీ సొసైటీ డైరెక్టర్లతో పాటు పలువురు నాయకులు మాజీ మంత్రి మంత్రి,వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం,యువ నాయకుడు గిరిబాబుని ముద్రగడ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా తన కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా ముద్రగడ పరిచయం చేసికున్నారు.ముద్రగడని కలిసిన వారిలో యర్రవరం సర్పంచ్ భీశెట్టి అప్పలరాజు,మర్రివీడు నానిశెట్టి సంకురమ్మ లోవరాజు,రమణయ్య పేట మాజీ ఉప సర్పంచ్ పట్టా సుబ్బారావు,సి.రాయవరం మాజీ సర్పంచ్ పలివెల రామచంద్రరావు,ఏలేశ్వరం సొసైటీ మాజీ డైరెక్టర్ సిరిపురపు రాజేష్,ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సఖిరెడ్డి బుజ్జి,సఖిరెడ్డి గాంధీ,మాజీ కౌన్సిలర్లు జువ్విన వీర్రాజు,గొడుగు నాగేంద్ర కుమార్, వాడపల్లి శ్రీను,కాకినాడ జిల్లా ఎస్సి,ఎస్టీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాచర్ల రమేష్,17వ ఇంచార్జి బదిరెడ్డి శీను,తూర్పు లక్ష్మీపురంకి చెందిన ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గునుపూడి కొండబాబు,విద్యా కమిటీ చైర్మన్ ముత్యాల రాజు,సోషల్ మీడియా కన్వీనర్ గొంతిరెడ్డి సతీష్,భీశెట్టి స్వామిలతో పాటు ప్రత్తిపాడు మండలానికి చెందిన ప్రత్తిపాడు సర్పంచ్ గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం, ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేరు కృష్ణ,అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడు దలే చిట్టిబాబు ఉన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *