ప్రత్తిపాడులో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు….మహానటుడు నందమూరి తారకరామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరామ్ వర్మ, ప్రత్తిపాడు అధ్యక్షుడు అడపా జగదీష్,కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్,ఉపాధ్యక్షుడు కర్రి వీరబాబు,ఎన్టీఆర్ అభిమానులు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి గుండె చప్పుడు దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నటించిన తొలిచిత్రం మనదేశం విడుదలై నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర మంతటా ఘనంగా జరిగాయని తెలిపారు.ఈసందర్భంగా అడపా జగదీష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు సుబ్బు, సాయిరామ్ వర్మ,జగదీష్ లను భారీ గజమాలతో సత్కరించారు.ఎన్టీఆర్ వజ్రోత్సవాల సందర్భంగా చంద్రబాబు,లోకేష్,టీడీ జనార్థన్,ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆశీస్సులతో అన్నా ఎన్టీఆర్ జనార్థన్ కేరేజ్ 922వ రోజు అయ్యప్ప స్వాములకి, పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు.సాయిరామ్ వర్మ, జి.శ్రీనివాసరావు,గూడెం అప్పారావు(బుజ్జి) సమకూర్చిన 5 కేజీల బియ్యం బస్తాలు పేదలకు అందించారు.ఈ కార్యక్రమంలో బొక్కా నూకరాజు,మండపాక శ్రీనివాసరావు,ఎన్టీఆర్ అభిమానులు,ఫౌండేషన్ సభ్యులు,తెదేపా శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!