రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా రివార్డులను అందుకున్న జిల్లా అధికారులు

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన అధికారులను ప్రశంసించిన రాష్ట్ర డీజిపి డా. జితేందర్ ఐపిఎస్ పోలీస్ స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా కేసుల్లోని నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన సీఐ నాగరాజు రెడ్డి,ఎస్సై శ్రీకాంత్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ సుధీర్ లకు ఈ రోజు రాష్ట్ర డీజిపి డా.జితేందర్ ఐపిఎస్ తమ కార్యాలయంలో రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా డిజిపి చేతుల మీదుగా అరువార్డులను అందుకున్న అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.2023 సంవత్సరంలో ప్రభుత్వం నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేవిధంగా కృషి చేసిన అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి,ఎస్సై శ్రీకాంత్ , కోర్టు డ్యూటీ ఆఫీసర్ సుదీర్ లు శనివారం డీజీపీ కార్యాలయంలో రివార్డులను అందుకున్నారు. సిఆర్. నెం.169/2023, భద్రాచలం పిఎస్ లో 480 కిలోల నిషేధిత గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు ముద్దాయిలకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష , ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా సి ఆర్ . నెం.198/2023, భద్రాచలం పిఎస్ 484 కిలోల నిషేధిత గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు ముద్దాయిలకు 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష , ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా పడేవిధంగా కోర్టు వారికి సాక్షాధారాలను సమర్పించి సమర్థవంతంగా పనిచేసినందుకు గాను వీరి ప్రతిభను గుర్తించి ఇట్టి రివార్డులను అందజేయడం జరిగింది. వీరి ముగ్గురితో పాటు నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయకుమార్ ని కూడా జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..