

మన న్యూస్ ,నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో భాగంగా కిసాన్ డ్రోన్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై అందించే కిసాన్ డ్రోన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి సత్యవాణి ,నెల్లూరు రూరల్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, టిడిపి మండల కన్వీనర్ ప్రదీప్, టిడిపి నాయకులు తుళ్లూరు రామయ్య, చెన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, అన్నం సుధాకర్ గౌడ్, ప్రవీణ్, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
