మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా మహిళల బీచ్ కబడ్డీ జట్టుకు ఐదుగురు పాకల క్రీడాకారిణులు ఎంపికైనట్లు కోచ్ పిల్లి హజరత్తయ్య తెలిపారు.1)వి.అర్చన 2)కె.భూమిక3) కె.సౌమ్య 4) కె. సి పోరా 5)కె. త్రిగుణ ఎంపికైనట్లు తెలిపారు.వీరు12 వ ఆంధ్ర రాష్ట్ర అంతర జిల్లాల బీచ్ కబడ్డీ టోర్నమెంట్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మే 2 నుండి మే 5 వరకు జరిగే పోటీలలో పాల్గోనున్నారు.ఈ సందర్భంగా క్రీడాకారిణులు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా. భాస్కర రావు కి కార్యదర్శి వై. పూర్ణచంద్రరావు కి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు క్రీడాకారిణులకు అభినందనలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *