పంటలు అధిక దిగుబడికి పంచగవ్యపాచిపెంట వ్యవసాయ అధికారి తిరుపతి రావు

పాచిపెంట, నవంబర్ 16( మన న్యూస్):=

పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలం లో పంచగవ్య తో అన్ని రకాల పంటలు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని పాచిపెంట వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. శనివారం నాడు మండలం విశ్వనాధపురం గ్రామంలో రైతు కిర్ల నాగభూషణరావు ఒక ఎకరా మామిడి తోట కోసం ప్రకృతి సేద్య ప్రతినిధి విజయ్ ఆధ్వర్యంలో పంచగవ్య తయారీ చేయించారు.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పంచగవ్య ను అన్ని పంటలపై పూత దశ మరియు పిందె దశలలో రెండుసార్లు పిచికారి చేసుకుంటే కనీసం 20 శాతం అధిక దిగుబడులు సాధించవచ్చునని అన్నారు.ప్రయోగపూర్వకంగా నిరూపణ జరిగిందని తెలిపారు. ముందుగా ఐదు కిలోల ఆవు పేడలో అరకిలో నెయ్యి వేసి కలిపి వారం రోజులు ఉదయం సాయంత్రం కలిపి ఉంచాలన్నారు.వారం రోజుల తర్వాత ఈ మిశ్రమానికి కొబ్బరి నీళ్లు, రెండు కిలోల బెల్లం, మూడు లీటర్ల పాలు, రెండు లీటర్ల పెరుగు రెండు లీటర్ల బాగా పులిసిన జీలుగ కళ్ళు గాని ఈస్ట్ మిశ్రమం బాగా మగ్గిన 12 అరటిపళ్ళు శుభ్రంగా కలిపి 15 రోజులపాటు ఉదయం సాయంత్రం కలుపుతూ ఉంచాలన్నారు.అనంతరం దీనిని వడగట్టి ఒక లీటరు నీటికి నాలుగు నుంచి ఐదు వడగట్టిన పంచగవ్య కలుపుకొని అన్ని పంటలపై పిచికారి చేసుకోవాలన్నారు.15 రోజుల వ్యవధిలో రెండవసారి కూడా పిచికారి చేసుకున్నట్లయితే రంగు రుచి నాణ్యతతో కూడిన 20 శాతం అధిక దిగుబడులు పొందడమే కాకుండా పంటకు తెగుళ్ళను తట్టుకునే శక్తి కలుగుతుంది.అని మార్కెట్లో దొరికే అన్ని రకాల గ్రోత్ మందుల కంటే కూడా ఇది ఎంతో నాణ్యమైన సహజ సిద్ధమైన గ్రోత్ ప్రమోటర్ అని వ్యవసాయ అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు బోను మోహన్ ప్రకృతి వ్యవసాయ ఎఫ్ ఎస్ కేరళ శాంతకుమారి పాల్గొన్నారు.

  • Related Posts

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి