మాకినేని బసవపున్నయ్య వర్ధంతి వేడుకలు—సిపిఎం మండల కార్యదర్శి, గండి సునీల్

మన న్యూస్: కడప జిల్లా: బ్రహ్మంగారి మఠం: ఏప్రిల్ 13: బ్రహ్మంగారి మఠం మండలంలోని సుందరయ్య భవనంలో శనివారం వారి చిత్రపటానికి సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ,మాకినేని బసవపున్నయ్య (1914-1992) భారత కమ్యూనిస్టు ఉద్యమ అత్యున్నత నేతల్లో ముఖ్యులు. ఉద్యమం వివిధ దశల్లో మార్గదర్శకత్వం వహించడమేగాక సైద్ధాంతికంగా కీలక భూమిక పోషించిన మేథా సంపన్నుడని వారు అన్నారు. తన శక్తియుక్తులన్నిటినీ ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసమే అంకితం చేసి ఆఖరు వరకూ పోరాడిన అచంచల యోథుడు. ప్రథమ సోషలిస్టు దేశమైన సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన కొద్ది మాసాల్లోనే సిపిఐ(ఎం) అఖిల భారత మహాసభలలో అరుణ పతాకావిష్కరణ చేసి కమ్యూనిజం అజేయమనే ఆత్మ విశ్వాసం వెలిబుచ్చిన ధీశాలి. మానవ చరిత్ర గమనాన్నే మార్చిన కమ్యూనిస్టు భావాలను వారి అపార త్యాగాలనూ ఎవరు అపహాస్యం చేయాలనుకున్నా చెల్లుబాటు కాబోదని హెచ్చరించిన సాహసి. ఉద్యమం ఎప్పుడు విధాన పరమైన అంశాలలో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినా సైద్ధాంతిక సంక్షోభాలు ఎదురైనా సమగ్ర అధ్యయనం చేసి దిశానిర్దేశం అందించిన ధీమంతుడని, అలుపెరగని పోరాటాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాడని ఆయన స్ఫూర్తితో అలిపిరిని పోరాటాలు సిద్ధమవుతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎర్రంపల్లి అజయ్, పార్టీ నాయకులు ఆంజనేయులు, రాహుల్, భాస్కర్, గురయ్య, అరవింద్ లు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి