మాకినేని బసవపున్నయ్య వర్ధంతి వేడుకలు—సిపిఎం మండల కార్యదర్శి, గండి సునీల్

మన న్యూస్: కడప జిల్లా: బ్రహ్మంగారి మఠం: ఏప్రిల్ 13: బ్రహ్మంగారి మఠం మండలంలోని సుందరయ్య భవనంలో శనివారం వారి చిత్రపటానికి సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ,మాకినేని బసవపున్నయ్య (1914-1992) భారత కమ్యూనిస్టు ఉద్యమ అత్యున్నత నేతల్లో ముఖ్యులు. ఉద్యమం వివిధ దశల్లో మార్గదర్శకత్వం వహించడమేగాక సైద్ధాంతికంగా కీలక భూమిక పోషించిన మేథా సంపన్నుడని వారు అన్నారు. తన శక్తియుక్తులన్నిటినీ ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసమే అంకితం చేసి ఆఖరు వరకూ పోరాడిన అచంచల యోథుడు. ప్రథమ సోషలిస్టు దేశమైన సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన కొద్ది మాసాల్లోనే సిపిఐ(ఎం) అఖిల భారత మహాసభలలో అరుణ పతాకావిష్కరణ చేసి కమ్యూనిజం అజేయమనే ఆత్మ విశ్వాసం వెలిబుచ్చిన ధీశాలి. మానవ చరిత్ర గమనాన్నే మార్చిన కమ్యూనిస్టు భావాలను వారి అపార త్యాగాలనూ ఎవరు అపహాస్యం చేయాలనుకున్నా చెల్లుబాటు కాబోదని హెచ్చరించిన సాహసి. ఉద్యమం ఎప్పుడు విధాన పరమైన అంశాలలో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినా సైద్ధాంతిక సంక్షోభాలు ఎదురైనా సమగ్ర అధ్యయనం చేసి దిశానిర్దేశం అందించిన ధీమంతుడని, అలుపెరగని పోరాటాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాడని ఆయన స్ఫూర్తితో అలిపిరిని పోరాటాలు సిద్ధమవుతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎర్రంపల్లి అజయ్, పార్టీ నాయకులు ఆంజనేయులు, రాహుల్, భాస్కర్, గురయ్య, అరవింద్ లు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..