మన న్యూస్ : తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా పిల్లలతో నెహ్రూ కు ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ప్రతియేటా నవంబర్ 14 న జరుపుకునే బాలల దినోత్సవం కార్యక్రమాన్ని గురువారం నాడు మండలంలోని శ్రీవిద్య టెక్నో హై స్కూల్ నందు ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం పరిపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు.విద్యార్ధినీ,విద్యార్థులకు నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసారు. విద్యార్థులు ఈ నృత్యప్రదర్షణలో ఉల్లాసంగా పాల్గొని తమ ప్రతిభా పాటవాలు చూపించారు. చిన్నారులు జాతీయ నాయకులు, సైనికుల వేషధారణలతో అలరించారు. తదనంతరం కరస్పాండెంట్ పివి .రమణారెడ్డి ఉపాద్యాయులు , విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో కరెస్పాండెంట్ రమణారెడ్డి మాట్లాడుతూ…. విద్యార్థినీ, విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని తెలియజేసారు. బాలల దినోత్సవం సమాజభవిష్యత్తును రూపొందించడంలో పిల్లల ప్రాముఖ్యతను గుర్తుచేస్తుందన్నారు. విద్యార్థులు చదువుపట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దానిని సాధించి సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్ధులను అన్ని రంగాలలో తీర్చిదిద్దడమే శ్రీ విద్యా స్కూల్ లక్ష్యం అన్నారు. తదనంతరం బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడాపాటిల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు కూనారపు శ్రీనివాసరావుని కరెస్పాండెంట్ రమణారెడ్డి సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పివి రమణారెడ్డి, డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి ,ప్రిన్సిపల్ రాధ,పాఠశాల ఇంచార్జ్ శ్రీనివాసరావు ,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed