ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంక్షలు ఎత్తివేయాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి. ఈనపల్లి పవన్ సాయి

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:తెలంగాణ రాష్ట్రంలో విద్యార్ధీ, ప్రజా పోరాటాలకు ఉస్మానియా కేంద్రంగా విశ్వవిద్యాలయంలో విద్యార్ధి హక్కులు కోసం కాకుండా క్యాంపస్ వెలుపల జరిగే పోరాటాలకు వెన్నుదన్నుగా ఉస్మానియా నిలుస్తోందినీ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి తెలిపారు. వందేమాతరం ఉద్యమం మొదలు తెలంగాణ ఉద్యమం వరకు పోరాటాలకు కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయంనీ, ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగ్యారంటీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ మా ఏడవ గ్యారంటీ అని ప్రకటించి నియంతృత్వ పోకడలు ఇక్కడ చెల్లదంటూ నాడు ప్రగతి భవన్ కంచెలు తీసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు క్యాంపస్ లో నినాదాలు, పోరాటాలు, ధర్నాలు ఉండకూడదు అని అప్రజాస్వామిక, నియంతృత్వ సర్క్యూలర్ రిజిస్టర్ నరేష్ రెడ్డి చేత జారీ చేయించారునీ విమర్శించారు.
ఈ సర్క్యూలర్ అప్రజాస్వామ్యం, అనైతికం, తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని (ఏఐఎస్ఎఫ్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి గా డిమాండ్ చేశారు. విద్యార్థులు సమస్యలు అనేకం ఉన్నాయి. మెస్ బకాయిలు, స్కాలర్ షిప్స్, హస్టల్స్ రీపేర్లు, పెండింగ్ ఫెలోషిప్స్, రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగా అభివృద్ధి కోసం నిధులు, నూతన భవనాలు ,రెగ్యూలర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పేరుతో వేలాది రూపాయలు ఫీజులు పెంపు ఈ అంశాలపై విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్నారు. వీటి గురించి మాట్లాడకుండా విద్యార్థులు గొంతు నోక్కె ప్రయత్నం చేయడం దుర్మార్గం అని అన్నారు. ప్రజాపాలన పేరుతో నియంతృత్వం అమలు చేయడాన్ని వెనక్కి తీసుకుని, తక్షణమే ఈ సర్క్యూలర్ వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కార్యదర్శి అక్కెనపల్లి నాగేంద్రబాబు, మండల నాయకులు సుజన్, వంశీ, నాయకులు కమల్ రాజ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు