

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఆటోలో ప్రయాణికురాలిని బెదిరించి దోపిడీకి పాల్పడిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపారు.ఈనెల 15న మేదరి భూమవ్వ అనే మహిళ అచ్చంపేట్ లోని తన కూతురు ఇంటికి వెళ్లేందుకు నిజాంసాగర్ బస్టాండ్ లో వేచి ఉండగా ఆటోలో వచ్చిన ఇద్దరు బస్టాండ్ ముందు ఆపారు.భూమవ్వ ఈ ఆటో అచ్చంపేట్ వెళ్తుందా అని అడుగగా ఆటో డ్రైవర్ అవునని చెప్పాడు.డ్రైవర్ సుందర్ రాజు,ఆటోలోని మరో మహిళ వడ్డే లక్ష్మి కలిసి ఆమెను ఆటోలో ఎక్కించుకున్నారు.బాచేపల్లి శివారులోకి తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు,వెండి కడియాలు లాక్కుని బాధితురాలిని అక్కడే వదిలి పారిపోయారు. దీంతో బాధిత మహిళ నిజాంసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సోమవారం బొగ్గు గుడిసే చౌరస్తాలో వాహన తనిఖీలు చేపడుతుండగా, ఆటోతో పారిపోతున్న డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించారు.నేరం ఒప్పుకోవడంతో సోమవారం ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పర్చి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు.కేసును సేదించిన ఎస్ ఐ శివకుమార్, శ్యామ్,మహేష్ బృందాన్ని సీఐ అభినందించారు.