ఆడపిల్లలు వేధింపులకు గురైతే ధైర్యంగా షీ టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు మంగళవారం రోజు గుండుమల్ మండలంలోని పిఎం శ్రీ మోడల్ స్కూల్ మరియు కాలేజీలోనీ విద్యార్థులకు షీ టీం పోలీసులు మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, మహిళలపై వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్మెయిలింగ్, సోషల్ మీడియా ద్వారా సెల్ఫోన్లో బ్యాడ్ కెమెంట్, రంగ్ కాల్స్, రంగ్ మెసేజ్ వంటి మొదలగు సమస్యలపై విద్యార్థులకు షి టీమ్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షి టీం పోలీసులు బాలరాజు, భరోసా టీమ్ శారద లు మాట్లాడుతూ,మహిళలకు విద్యార్థులకు షి టీమ్ పోలీసులు అండగా ఉంటారని ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, వేధింపులకు గురైన షీ టీమ్ పోలీసులను నేరుగా సంప్రదించవచ్చు, లేదంటే షీ టీం నెంబర్ కి 8712670398 కాల్ చేసి సమస్య ని చెప్పవచ్చు అని అన్నారు.కంప్లైంట్ ఇఛ్చిన వారి వివరాలు పూర్తిగా గొప్యంగ ఉంచడం షీ టీం యొక్క ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. అలాగే ఏ హెచ్ టీ యు,మానవ అక్రమ రవాణా జరగకుండా నివారించుటకి పనిచేస్తుందని మానవ అక్రమ రవాణా చేసి o ఆర్గాన్స్ అమ్మడం, వెట్టిచాకిరీ చేపించడం, వ్యభిచారం, బాల్య వివాహాలు చేపించడం జరుగుతుంది కాబట్టి, ఇలాంటివి జరగకుండా ఏ హెచ్ టీ యు పనిచేస్తుంది అని తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఒంటరి మహిళలకు, వేధింపులకు గురైన వారికి, చైల్డ్ మ్యారేజెస్ సంబంధించిన మహిళలకు విద్యార్థులకు భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని బాధిత మహిళలు భరోసా సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే అమ్మాయిలకి, ఆడవారికి ఏ ఇబ్బంది ఎదురైనా నిర్భయంగా షీ టీమ్ ని సంప్రదించవచ్చు అని షీ టీమ్ పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి షి టీమ్ పోలీసులు బాలరాజు, భరోసా సెంటర్ శారద, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..