స్వర్గీయ మొగిలయ్య శెట్టి నాటక రంగంలో నవరస నటనా చక్రవర్తిగా కీర్తి పొందారు సంస్మరణ కృషి సభలో పలువురు వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 8: మన న్యూస్

చిత్తూరు లోని స్థానిక నాయుడు బిల్డింగ్స్ విజయం విద్యా సంస్థల ఆవరణంలో ప్రముఖ నాటక రచయిత, నటుడు, గాయకులు స్వర్గీయ శ్రీ.సి. మొగిలయ్య శెట్టి గారి సంస్మరణ సభ శనివారం ఉదయం 10:30 గంటలకు మన సంస్కృతి కళా సంస్థ అధ్యక్షులు సహదేవ నాయుడు ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగింది. పౌరాణిక ,చారిత్రక, సాంఘిక, దేశభక్తి నాటక రంగాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.ముఖ్య అతిధి శ్రీ వరసిద్ధి కళాక్షేత్రం ప్రధాన కార్యదర్శి పాడి రమేష్ బాబు మాట్లాడుతూ మొగిలయ్య శెట్టి నాటక కళా రంగానికి అంకితమై నాటక రచయితగా,నటుడిగా నటిస్తూ , పద్యాలు, గేయాలు పాడుతూ నాటక రంగాన్ని బతికించడంలోను, నాటక కళాకారులను ప్రోత్సహించడంలో వీరి సేవలు మరువలేవని తెలిపారు.అనంతరం ప్రముఖ కవి డాక్టర్ వల్లేరుహరి నాయుడు మాట్లాడుతూ వీరు పుస్తకాలు, నాటకాలు రాసి రచయితగాను, గేయాలు ,భక్తి గీతాలు రాసి సొంతంగా పాడి గాయకుడుగాను రాణించారని తెలిపారు.ఆత్మీయ అతిథి రచయిత్రి వి. శ్యామలాదేవి, వీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు మరియు పిల్లల చేత పౌరాణిక, దేశభక్తి నాటకాలు వేయించేవారని*ఆయన ప్రోత్సాహముతో నేను నాటకాలలో నటించానని అనుభవాలు తెలిపారు. అతిథి ప్రముఖ కవి. మునిస్వామి మాట్లాడుతూ నా రచనలను ,సాహిత్యాన్ని ప్రోత్సహించడం లో ముందుంటారని నాకు “మహాకవి” బిరుదును ఇచ్చి గౌరవించిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. విశిష్ట అతిథి ప్రముఖ రచయిత్రి యం.ఆర్ .అరుణ కుమారి మాట్లాడుతూ ఇటు అధ్యాపక వృత్తికి న్యాయం చేస్తూ అటు నాటక రచయితగా నటుడుగా గాయకుడుగా రాణించిన నవరస నటనాచక్రవర్తి” గా కీర్తి పొందారని తెలిపారు.అనంతరం రామచంద్ర మిషన్ ప్రశక్షికలు నాగరాజు మాట్లాడుతూ మాది చిన్ననాటి స్నేహబంధమని, వీరికి దైవభక్తి ఎక్కువ అందువలన కీర్తనలు, భక్తిపాటలు,గేయాల పాడడం లో దిట్ట అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలకట రెడ్డప్ప , శిఖండి సినిమా హీరో కోడి కిషోర్ ,పార్థసారధి నాయుడు, పాకాల రాజగోపాల్, రాధ, చంద్రశేఖర్, సునందన్ రెడ్డి ,కృష్ణంరాజు, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, మనోహర్, అనంత కుమార్, జీను రాజశేఖర్, మిట్ట మహేంద్ర,రంగనాథం విజయ. ఆనంద నాయుడు ,కుటుంబ సభ్యులు, బంధువులు మరియు కవులు, కళాకారులు, గాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి