

మనన్యూస్,కామారెడ్డి:కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలో ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య యువకుడు 32 సంవత్సరాల వయసు గల సుంకరి ప్రవీణ్ గౌడ్ గా గుర్తించారు.ఈమెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.తుజాల్పూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్ గత 3 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఫైవ్ స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ లో లోను తీసుకున్నాడు. మొదటినుంచి ప్రవీణ్ గౌడ్ ఈఎంఐ సక్రమంగా చెల్లిస్తున్నాడు.చివరి ఈఎంఐ 8000 రూపాయలు చెల్లించడంలో జాప్యం కావడంతో ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది గత మూడు రోజులుగా ప్రవీణ్ ను వేధింపులకు గురి చేశారు.అంతేకాకుండా ఇంటికి వెళ్లి ప్రవీణ్ గౌడ్ ను దుర్భాషలాడుతూ సిబ్బందిని వేధించారు.దీంతో మనోవేదనకు గురైన ప్రవీణ్ గౌడ్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు ప్రవీణ్ గౌడ్ కు భార్య అర్చన ఇద్దరు కుమారులు ఉన్నారు.ఇంటి పెద్ద ప్రవీణ్ గౌడ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం వీధిన పడింది.ప్రవీణ్ గౌడ్ తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.