

మన న్యూస్ జనవరి 20:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, శెట్టిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మదన్మోహన్, ఆదేశాల మేరకు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులతో ఐదు లక్షల విలువగల సిసి రోడ్డు నిర్మాణం పనులు కాంగ్రెస్ పార్టీ.మండల అధ్యక్షుడు బుర్ర నారా గౌడ్. ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు, ఈ సందర్భంగా మండల కోఆర్డినేటర్. అట్టెం శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీలో చాలా సంవత్సరాలుగా మట్టిరోడుతో ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి సిసి రోడ్డుకు నిధులు కేటాయించారు, కాలనీవాసులు శెట్టిపల్లి ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు, సాయిలు ఇంటి నుండి. కటికే హరిలాల్ వరకు. సీసీ రోడ్డు. పనులు ప్రారంబించడం జరిగింది, &చిట్యాల సంగయ్య సీ,ఎం.ఆర్.ఎఫ్. చెక్కును ఎమ్మెల్యే మదన్ మోహన్, ఆదేశాల మేరకు ఇంటి వద్దనే చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు ఎదురుగట్ల పెద్ద కిష్ట గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, డైరెక్టర్ గోపాల్, పూల్ సింగ్, అంజా గౌడ్, మల్లయ్య, బాలయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నగేష్, యూత్ అధ్యక్షులు రాజు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రఫీ యొద్దీన్, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, భాస్కర్ గౌడ్, మండల నాయకులు రాజేశ్వర్గౌడ్, శివలాల్. శెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నాడం జరిగింది