

మనన్యూస్,ఆదిభట్ల-:ఆదిభట్ల మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ముఖ్య అతిథిగా పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి.ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్ తో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదిభట్ల నుండి కొంగరకలాన్ చౌరస్తా మీదుగా మంగళపల్లి వరకు 25 కోట్ల రూపాయల నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు,ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు,ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు బిల్లు,అదేవిధంగా 500 లకే సిలిండర్,ఇందిరమ్మ ఇల్లు,కొత్త రేషన్ కార్డులు,రైతు భరోసా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అందిస్తామని తెలిపారు, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజా పాలనలో ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నామని వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు,ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో పట్టుబట్టి అధిక నిధులు తీసుకొచ్చారని ఆదిభట్ల మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు అని అన్నారు,ఆదిభట్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు,త్వరలో మరిన్ని నిధులు వెచ్చించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు,ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు,మున్సిపాలిటీల చైర్మన్లు,కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీల అధ్యక్షులు, కౌన్సిలర్లు,జడ్పిటిసిలు,ఎంపీపీలు మాజీ సర్పంచులు,pacs డైరెక్టర్లు,మార్కెట్ డైరెక్టర్లు,కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.