

మన న్యూస్,గద్వాల జిల్లా: గద్వాల జిల్లా తేదీ 09.01.20 నాడు మధ్యాహ్నం అందాజ 03:00 గంటల సమయంలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల సబ్-ఇన్స్ పెక్టర్ శ్రీ. కళ్యాణ్ కుమార్ వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తన సిబ్బంది మరియు గద్వాల పట్టణ ఇన్స్పెక్టర్ టి.శ్రీను మరియు సిబ్బంది గద్వాల పట్టణ పరిదిలోని పాత బస్టాండ్ ఏరియా దగ్గర వాహనాలని తనిఖీ చేస్తున్న క్రమం లో ఒక బొలెరో MAXX pickup నెంబర్ TG-31- T-1267 గల వాహనం లో ఇద్దరు వ్యక్తులు శ్రీ వాసవి బ్రాండ్ మరియు డైమండ్ బ్రాండ్ అనే పేరు గల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలు గల కాటన్ లను కలిగి వుండడాన్ని గుర్తించడం జరిగింది. అట్టి ఇద్దరు వ్యక్తులను విచారించగా వారి పేర్లు 1. సోమిశెట్టి వెంకటేశ్వర్లు 5/0 పురుషోత్తం వయస్సు: 29 సం. రాలు, కులం: వైశ్య, వృత్తి: వ్యాపారం R/O కదిరేపాడు గ్రామం, పానగల్ మండలం వనపర్తి జిల్లా ప్రస్తుతం హౌసింగ్ బోర్డ్ కాలనీ నాగర్ కర్నూల్ టౌన్, 2. యాస సుధాకర్ రెడ్డి 5/౦ కృష్ణారెడ్డి వయసు 35 సంవత్సరములు, కులం: రెడ్డి, వృత్తి: వ్యాపారం R/O రామానుజపురం గ్రామం, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా అను ఇద్దరు వ్యక్తులు “రూపానిష్ డైమండ్” అను మ్యానుఫ్యాక్చరింగ్ పేరు గల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లను కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా రాజేంద్రనగర్ మండలం రంగారెడ్డి జిల్లా మరియు ” శ్రీ వాసవి” అను పేరు గల అల్లం వెల్లుల్లి పేస్ట్ ను శివ అనే వ్యక్తి దగ్గర మేము కొన్నాము అని. అయితే శివ అనే వ్యక్తి కాటేదాన్ నివాసి అయిన ఏక్బల్ అను వ్యక్తి దగ్గర కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుగోలు చేసి వాటిని స్వచ్ఛమైన అల్లం వెల్లులి పేస్ట్ మాదిరిగా చెలామణి చేస్తూ సరఫరా చేయగా అ ఇద్దరు వ్యాకులు అట్టివాటి గురించి ప్రజలు ఇవ్వి నకిలీవి అని గుర్తిస్తారు కదా అని అడుగగా శివ అనే వ్యకి మేము సరఫరా చేసే అల్లం వెల్లులి పేస్ట్ లను ఎవ్వరు నకిలీవి అని గుర్తించలేరు, మీరు మా దగ్గర తక్కువకు కొని ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు, అన్నీ మేము చూసుకుంటాము అని శివ చెప్పగా, ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి అప్పటి నుండి పై ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా పై వ్యక్తుల నుండి అల్లం వెల్లుల్లి పేస్టును సేకరించి వారి బొలెరో MAXX pickup TG-31- T-1267 వాహనంలో వేసుకుని గద్వాల పట్టణంలో గల హోల్ సేల్ షాప్ లకు అమ్మి అక్రమంగా డబ్బులు సంపాదించేవారు, అదే క్రమం లో 09.01.2025 గద్వాల లకు తీసుకువచ్చి పాత బస్టాండ్ ఏరియాలో అమ్ముతుండగా మధ్యాహ్నం అందాజ 03:30 గంటల సమయంలో పట్టుకోవడం జరిగింది. తర్వాత పై ఇద్దరు వ్యక్తులను మరియు వాహనాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి వాహనాన్ని తెరిచి చూడగా అందులో శ్రీ వాసవి బ్రాండ్ కు చెందిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 200 గ్రాములు. గల 30 కాటన్ లు ఒక్కో కాటన్ లో 80 ప్లాస్టిక్ డబ్బాలు చొప్పున) అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్గిన డబ్బాలు, 1/2 కేజీ గల రెండు కాటన్ లు ఒక్కో కాటన్ లో 36 ప్లాస్టిక్ డబ్బాలు, మరియు 1 kg గల 5 కాటన్ లు ఒక్కో కాటన్ లో 20 ప్లాస్టిక్ డబ్బాలు కలవు మరియు డైమండ్ బ్రాండ్ వి 200 గ్రాములు గల ఆరు కాటన్ లు ఒక్కో కాటన్ లో 120 ప్లాస్టిక్ డబ్బాలు, 1/2 kg గల రెండు కాటన్ లు ఒక్కొక్క కాటన్ లో 48 ప్లాస్టిక్ డబ్బాలు, 1 kg ne 5 కాటన్ లు ఒక్కో కాటన్ లో 24 ప్లాస్టిక్ డబ్బాలు మరియు 5 kg గల 15 కాటన్ లలో ఒక్కో కాటన్ లో 6 ప్లాస్టిక్ డబ్బాలు మరియు ఎలాంటి బ్రాండ్ పేరు లేకుండా గ్రైండింగ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 10 కేజీల డబ్బాలు మొత్తం 9 కలవు. శ్రీ వాసవి బ్రాండ్ గల అల్లం వెల్లుల్లి పేస్టును కేజీ 90 రూపాయలు చొప్పున, 1/2 kg గల వాటిని 45 రూపాయల చొప్పున, 200 గ్రాములు గల వాటిని 12 రూపాయలు చొప్పున, మరియు డైమండ్ బ్రాండ్ గల అల్లం వెల్లులి పేస్ట్ల లను 1 Kg గల దానిని 60 రూపాయల చొప్పున, 1/2 kg గల దానిని 34 రూపాయలచొప్పున, 200 గ్రాముల దానిని 12 రూపాయలు చొప్పున అమ్మి
అక్రమంగా సంపాదించేవారని తెలిపినారు. యస్ ఐ పంచనామా నిర్వహించి వారిపై కేసు నమోదు చేసి కల్తీ అల్లం వెల్లుల్లి రవాణా కు ఉపయోగించిన బొలెరో మాక్స్ పికప్ నెంబర్ TG-31- T-1267 మరియు పైన తెలిపిన వివరములు గల శ్రీ వాసవి మరియు డైమండ్ రెండు కలిపి అందాజ 800 కేజీల అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్ చేయడం జరిగింది. అనంతరం నకిలీ అల్లం వెల్లుల్లి తయారు చేసే ఫ్యాక్టరీ కి వెళ్ళి పరిశీలించగా ఫ్యాక్టరీ వారు అట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారీకి అల్లం, వెల్లుల్లి ని వినియోగించకుండా కేవలం వెల్లుల్లి పొట్టు, యాసీడ్స్ మారియు కేమికల్స్ వాడుతున్నట్లు తెలిపినారు. మరియు గద్వాల పట్టణం లోని గంజిపేట కాలనీ లో స్టార్ ఫంక్షన్ హాల్ ప్రక్కన సితార ఇండస్ట్రియల్ అనే షాప్ లో వివిద రకాల కెమికల్స్ ను ఉపయోగించి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నారని సమాచారం తో నిన్న ఉదయం 10:00 గంటలకు సీతార ఇండస్ట్రియల్ లో తనికి చేసి వివిద కెమికల్స్ ను మరియు అందాజ 100 కేజి క నకిలీ అల్లం పేస్టు ను సీజ్ చేసి అ షాప్ యజమాని అయిన ఖాజా అమీర్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులకు సంబందించి ఇంకా విచారణ జరుగుతున్నది.
నిందితుల పేరు:
1)సోమిశెట్టి వెంకటేశ్వర్లు s/o సోమిశెట్టి పురుషోత్తం, వయస్సు: 29 సంవత్సరాలు, కులం: వైశ్య, వృత్తి: వ్యాపారం r/o కదిరేపాడు గ్రామం పానగల్ మండలం వనపర్తి జిల్లా ప్రస్తుతం హౌసింగ్ బోర్డ్ కాలనీ నాగర్ కర్నూల్ టౌన్ మరియు నాగర్ కర్నూల్ జిల్లా,
2)యాస సుధాకర్ రెడ్డి S/O కృష్ణారెడ్డి వయస్సు: 35 సం. రాలు, కులం: రెడ్డి, వృత్తి: వ్యాపారం r/o రామానుజపురం గ్రామం, శాలిగౌరారం మండలం నల్లగొండ జిల్లా ప్రస్తుతం జోడిమెట్ల ఘట్కేసర్ మండల్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా..
3) జపాల శివ నివాసం: కవ్వాడి పల్లి గ్రామం, అబ్దుల్లాపూర్ మెట్, రంగారెడ్డి జిల్లా,
4) ఇక్బాల్ నివాసం: కాటేదాన్, హైదరాబాద్.
5) ఖాజా హమీర్ నివాసం: గంజిపేట కాలనీ, గద్వాల పట్టణం.
జిల్లాలో నకిలీ, అక్రమ, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా పోలీస్ అధికారులు ఎల్లపుడూ వాటిపైన నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా ఏదైనా తక్కువ ధరకు, చవకగా దొరుకుతుంది అంటే వెంటనే కొనకుండా ఒకసారి ఆలోచించి కొనాలని, అసలివి మరియు నకిలీ లను గుర్తించాలని, ఏవైనా నకిలీ, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలపైనా ఏమైనా సమాచారం ఉన్నట్లు అయితే పోలీస్ అధికారులకు , డైల్ 100 కు గాని గద్వాల si 8712670297 గాని సమాచారం అందించాలని కోరడం జరుగుతుంది.
