సీడ్ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎంబిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి

మనన్యూస్:వెదురుకుప్పం వెనుకబడిన సంచారజాతులు అభివృద్ధి జరగాలంటే కేంద్రప్రభుత్వం సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన సీడ్ పథకం సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని శనివారం బి.సి సంక్షేమ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖామాత్యులు యస్.సవితను తిరుపతి పద్మావతి అతిథి గృహం నందు ఎంబిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి మర్యాదపూర్వకంగా కలసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె సానుకూలంగా స్పందించి,సీడ్ సర్వే త్వరితగతిన పూర్తి చేయడానికి సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సంచారజాతుల అభివృద్ది కొరకు కేంద్రప్రభుత్వం సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన సీడ్ పథకం (స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డి-నోటిఫైడ్,నోమెడిక్ అండ్ సెమీ-నోమెడిక్ ట్రైబ్స్) ద్వారా బిసి-ఎ లోని అత్యంత వెనుకబడిన కులాల వారికి 4 విభాగాల్లో లబ్ది చేకూర్చడం జరుగుతుందని,ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఏపీ లోని అన్ని జిల్లాలకు ఉత్తర్వు జారీ చేసినారు.అన్ని జిల్లాలలోని యం.డీ.ఓ.లు ఈ సర్వే చేసి జిల్లా అధికారులకు అందజేయాలి. జిల్లా అధికారులు ఎ.పి.బి.సి.మంత్రిత్వ శాఖకు పంపిస్తే ఎ.పి ప్రభుత్వం సంచారజాతులు 32 కులాలకు నోమెడిక్, సెమీ- నోమెడిక్, డి-నోటిఫైడ్ ట్రైబ్స్ కులధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తారు.ఈ లిస్టును కేంద్రప్రభుత్వానికి పంపిస్తే,కేంద్రప్రభుత్వం లోని సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ యం.బి.సి.ల అభివృద్ధి కొరకు ప్రణాళిక చేసి నాలుగు విధాలుగా, ఇల్లు లేని వారికి ఇండ్లు, వ్యాపారము కొరకు ఋణాలు, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు పొందేందుకు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు కానీ అన్ని జిల్లాలలోను ఈ సర్వే నత్తనడకన సాగుతుందని, కొన్ని జిల్లాలలో ఇంకా ప్రారంభం కానే లేదని చాలా మంది అధికారులకు ఈ కులాల పైన అవగాహన లేదని మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ సంచార జాతుల సంఘం మరియు దాసరి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పూసల రవి,టీడీపీ బీసీ దాసరి సాధికార సమితి జిల్లా అధ్యక్షులు మరియు ఏపీడీఆర్పీఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోలా జయచంద్ర పాల్గొన్నారు

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు