వంగ‌వీటి రంగాకు ఎమ్మెల్యే ఘ‌న నివాళి

మన న్యూస్:తిరుప‌తి సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయ‌కుడు వంగ‌వీటి మోహ‌న రంగా అని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. కాపుల కోస‌మే కాకుండా బ‌డుగు,బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం పాటుప‌డిన వ్య‌క్తి రంగా అని ఆయ‌న అన్నారు.రంగా ఆశయాల సాధ‌న కోసం ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న కోరారు.స్థానిక అనంత‌వీధి స‌ర్కిల్ లో రాధా రంగ మిత్ర‌మండ‌లి అధ్య‌క్షులు ఆర్కాట్ కృష్ణ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో వంగ‌వీటి రంగా 36వ వ‌ర్థంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.ఈ వేడుక‌ల్లో ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పాల్గొని రంగా చిత్ర‌ప‌టానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అనంత‌రం పేద‌ల‌కు అన్న‌దానం నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు మాట్లాడుతూ నాయ‌కుడుగా, ఎమ్మెల్యేగా వంగ‌వీటి రంగా పేద‌ల ప‌క్షాన నిలిచి తుది వ‌ర‌కు పోరాడిన గొప్ప వ్య‌క్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, వూక విజయ్ కుమార్, బుల్లెట్ రమణ, ఆముదాల తులసి రాం,కోడూరి బాలసుబ్రమణ్యం, పాట‌కం వెంక‌టేష్, రాజారెడ్డి, ఆముదాల వెంకటేష్, నీలాద్రి, వినోద్ రాయల్, అంజి బాబు, మౌల , శేషాద్రి, తోట జయంతి , శిరీష , మధుబాల తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.