హోం మంత్రి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన

మనన్యూస్:తిరుపతి కేంద్ర హోం మంత్రి అమిత్ షా దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకర రీతిలో మాట్లాడటం దుర్మార్గమని, హోం మంత్రి పదవికి ఆయన అనర్హుడని, వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలగురవం బాబు, నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ కార్యక్రమం జరిగింది. తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుంచి ర్యాలీగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంవద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాల గురవం బాబు మాట్లాడుతూ దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ అని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ఎదగడానికి రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నతుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆ మహానుభావుడు పేరు తలుచుకోని దళితులు లేరని అన్నారు. ఆయన పేరు స్మరించవద్దు అన్నట్లుగా అమిత్ షా రాజ్యసభలో చెప్పడం దుర్మార్గమన్నారు. పీడిత వర్గాలకు అంబేద్కర్ దేవుడన్న విషయం గుర్తించాలన్నారు.
తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ తన మిత్రుడు అదానీని కాపాడుకోవడానికి అమిత్ షా ప్రజల దృష్టిని మరల్చడానికి అంబేద్కర్ను అవమానకరంగా మాట్లాడటం జరిగిందన్నారు. ఇది ఏమాత్రం క్షమించడానికి వీలులేదన్నారు. తన తప్పును తెలుసుకొని ఇప్పటికే అమిత్ షా రాజీనామా చేసి ఉండాలని అయితే ఇప్పటికీ ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు అంటే ఇంతకు మించిన నేరం మరొకటి లేదన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అందరికీ సమన్యాయం జరగాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పరితపించారని తెలిపారు. ప్రపంచ మేధావిగా గుర్తించబడి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన మా మహానుభావుడుని అవమానకరంగా మాట్లాడటం క్షమించరాన్ని నేరమన్నారు. ఇప్పటికైనా అమిత్ షా రాజ్యాంగ నిర్మాత పట్ల తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. పిసిసి పిలుపుమేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద చేపట్టిన ఈ నిరసన విజయం విజయవంతం అయ్యిందని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరిగితే సరిపోదని దానిని రచించిన అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకొని ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. నేడు బిజెపి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సొంత రాజ్యాంగాన్ని అమలకు ప్రయత్నించడం ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే సరైన గుణపాఠం చెబుతారని చెప్పారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ బిజెపి మతోన్మాద చర్యలకు ఇది పరాకాష్ట అని అన్నారు. భారతదేశం అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళుతోందన్నారు. కానీ బిజెపి మనువాద సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటాచలపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ దామోదర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రామకృష్ణ, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, ఎస్సీ విభాగం కన్వీనర్ బోయిన నరేంద్ర, బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బయలు గోపి, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, రేణిగుంట మండల అధ్యక్షుడు రాహుల్ బోస్, బీసీ విభాగం మాజీ అధ్యక్షుడు చిరంజీవి, దామినేడు రాజా, తిరుపత నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గొడుగు చింతల గోపి, ప్రధాన కార్యదర్శి తలారి గోపి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు నోబెల్ డే కార్య క్రమాన్ని రసాయన శాస్త్ర విభాగ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో…

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మట్టి నమూనా సేకరణ మరియు పరీక్ష విధానాలపై పాఠశాల విద్యార్థులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.