క‌రుణాక‌ర్ రెడ్డి కి స‌నాత‌న ధ‌ర్మం గురించి మాట్లాడే అర్హ‌త లేదుఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్:తిరుప‌తి,స్థానిక చిన్న‌బజారు వీధిలోని గాలిగోపుర మ‌ఠాన్ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు మంగ‌ళ‌వారం సాయంత్రం ప‌రిశీలించారు. ఈఓ మునికృష్ణ మూర్తి ఎమ్మెల్యేకి స్వాగ‌తం ప‌లికి మ‌ఠం ఆవ‌ర‌ణ‌లోని శ్రీకృష్ణని ఆల‌యంలో పూజ‌లు నిర్వ‌హించారు. పూజారులు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసుల‌ను ఆశ్వీర‌దించారు. అనంత‌రం మ‌ఠం ఆవ‌ర‌ణ‌ను ప‌రిశీలించారు. వ‌ర్షాకాలంలో భ‌వ‌నం లీకేజి ల కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు ఈఓ ఎమ్మెల్యేకు వివ‌రించారు. కోటి రూపాయ‌ల‌తో మ‌ఠంలో మ‌ర‌మ్మ‌త్తులు చేయించాల‌న్న ప్ర‌తిపాద‌న‌లు రెండేళ్ళుగా పెండింగ్ లో ఉన్న‌ట్లు ఈఓ ఎమ్మెల్యేకి వివ‌రించారు.క్రీస్తుశ‌కం 1413 లో స్థాపించిన గాలిగోపుర మ‌ఠం చ‌రిత్ర ఘ‌న‌మైన‌దని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. దేవాదాయ శాఖ ఆధీనంలో న‌డుస్తున్న ఈ మ‌ఠం మ‌ర‌మ్మ‌త్తుల‌కు కోటి రూపాయ‌లు టిటిడి అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు. కాగా అన్న‌మయ్య విగ్ర‌హానికి శాంట క్లాస్ టోపీ పెట్ట‌డం పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. ఆక‌తాయ‌ల ప‌నిని ఏదో పెద్ద అప‌చారం జ‌రిగిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మ‌డి జిల్లా అధ్య‌క్షులు క‌రుణాక‌ర్ రెడ్డి రాద్దాంతం చేయ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న అన్నారు. గ‌త ఐదేళ్ళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాల‌న‌లో దేవాల‌యాల్లో జ‌ర‌గ‌ని అప‌చారం లేద‌ని ఆయ‌న అన్నారు. ర‌థాలు త‌గ‌ల‌బెట్ట‌డం, దేవుడి విగ్ర‌హాల త‌ల‌లు తెగ్గొట‌డం వంటివి లెక్క‌లేనన్ని జ‌రిగాయ‌న్నారు. శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌కు వాడే నెయ్యి క‌ల్తీ క‌రుణాక‌ర్ రెడ్డి ఛైర్మ‌న్ గా ఉండ‌గానే జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. క‌రుణాక‌ర్ రెడ్డి స‌నాత‌న ధ‌ర్మంపై మాట్లాడ‌టం దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లు ఉంద‌ని ఆయ‌న అన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు స‌నాత‌న ధ‌ర్మం కాపాడ‌టానికి కృషి చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన నాయ‌కులు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి, ఆర్కాట్ కృష్ణ‌ప్ర‌సాద్, దినేష్ జైన్, ఆముదాల వెంక‌టేష్, వినోద్, మావిళ్ళ సుధాక‌ర్, టిడిపి నాయ‌కులు ఆముదాల తుల‌సి రామ్, జ‌య‌కుమార్, చుక్క‌ల దాము, ర‌వి శంక‌ర్ యాద‌వ్, బిజేపి వ‌ర‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి