

మన న్యూస్:పినపాక నియోజకవర్గం, అశ్వాపురం; రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్రహోంమంత్రి అమిత్ షా వేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని,భేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మండల నాయకులు రెడ్డిబోయిన వెంకన్న, లంకెల శ్రావణ్, డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కు, ఆయన సిద్ధాంతాలకు బీజేపీ వ్యతిరేకమని వారు మండిపడ్డారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ను, ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవించకూడదని మనుస్మృతి, ఆర్ఎస్ఎస్ భావజాలం అమిత్ కు నేర్పుతోందన్నారు. దళితులను ఈసడించడమే పనిగా పెట్టుకున్న సంఘ్ పరివార్ దళితులకే కాదు, సామాజిక న్యాయం కోరుకునే వారందరికీ స్ఫూర్తి ప్రదాత డా. అంబేద్కర్ ను అవమానించడం చాలా సులువైన వ్యవహారంగా మారిందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్” అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్నిసార్లు భగవంతుడి పేరు తలిస్తే ఏడు జన్మల దాకా స్వర్గ ప్రాప్తి కలిగేది అని అన్నారన్నారు. అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు బీజేపీ, ఆర్.ఎస్.ఎస్.కు త్రివర్ణ పతాకం మీద, అశోకచక్రం మీద విశ్వాసం లేదని నిరూపించాయన్నారు. సంఘ్ పరివార్ అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించి రూపొందించిన భారత రాజ్యాంగం మీద ఇసుమంత గౌరవం కూడా లేదని అనేకసార్లు రుజువైందన్నారు. ఆర్.ఎస్.ఎస్. కార్యాలయం మీద 50 ఏళ్లపాటు త్రివర్ణ పతాకం ఎగురవేయడానికి నిరాకరించిందని, గాంధీ హత్య తరవాత అప్పుడు కేంద్ర హోం మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ ఆర్.ఎస్.ఎస్. ను నిషేధించారని గుర్తుచేశారు. తర్వాత అనేక వాగ్దానాలు చేస్తేనే గాని ఆర్.ఎస్.ఎస్. మీద నిషేధం తొలగలేదన్నారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ఆర్.ఎస్.ఎస్. హామీ ఇవ్వవలసి వచ్చిందన్నారు.ఆ ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చిన అమిత్ షా నోటికొచ్చినట్టు అంబేద్కర్ అని అయిదుసార్లు అని ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారని, అమిత్ షా ప్రతిపక్షాలను దుయ్యబట్టడానికే ఈ మాట ప్రస్తావించి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అంబేద్కర్ నూ తీవ్రంగా అవమానించారన్నారు.ఈ కార్యక్రమంలో
ఏఐవైఎఫ్ అశ్వాపురం మండల నాయకులు, రాజు, రాము, రఘు, సతీష్, శ్రీకాంత్, తదులు పాల్గొన్నారు