కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యం సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి

మన న్యూస్:పినపాక నియోజకవర్గం,మణుగూరు సింగరేణి యాజమాన్యం గని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని, ఉత్పత్తి పై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై లేదని,సామాజిక కార్యకర్త కర్నె రవి అధికారుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓసి -2 లో జరిగిన ప్రమాదంలో ఆపరేటర్ మృతి ఘటన ఫై సమగ్ర విచారణ చేపట్టి ప్రమాదానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. గని ప్రమాదాలతో కార్మికులుభయాందోళనకు గురవుతున్నారనన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణ పై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రమాదాలకు సంబంధించి బాధ్యులపై క్రిమినల్ చర్య తీసుకొని, వారిని సస్పెండ్ చేయాలన్నారు.ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కార్మికుల పై ఒత్తిడి చేస్తూ పని చేయుంచడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింరేణి అధికారులు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవాడానికే పని చేస్తున్నట్లు కనబడుతుందని, కార్మికుల సంక్షేమం పట్ల గాని రక్షణ యాజమాన్యానికి పట్టింపు లేదన్నారు. కార్మికులను కాపాడటంలో భద్రత ప్రమాణాలు పాటించడం లేదన్నారు. కార్మికుల పనిస్థలాల్లో కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సరైన రక్షణ చేపట్టాలని యాజమాన్యానికి సూచించారు. ఓసి -2 ప్రమాదానికి సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, కార్మిక అవగాహన లేని సూపర్వైజర్లు, కాలం చెల్లిన యంత్రాలు, వాహనాలు, సరైన రక్షణ చర్యలు లేక పోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు.రక్షణకు సంబంధించి రోడ్ల విషయంలో, దుమ్మును అరికట్టడంలో, ఫైర్‌ కోల్‌ నిరోధించడంలో గాని,మిషనరీపూర్తిస్థాయిలో మర
మ్మతులు చేసి అందించడంలో గాని కార్మికులకు కావలసిన సేప్టీ పరికరాలను అందించడంలో ఏరియాలో అధికారులు ఎప్పుడూ నిర్లక్ష్యం వహించి,కార్మికులను ఇబ్బంది పెట్టడానికి పనిచేస్తున్నా రని విమర్శించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోవాల్సినకార్మిక సంఘాల నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం క పనిచేస్తున్నారని, మాది జాతీయ సంఘం కాదు, మాది జాతీయ సంఘం అంటూ గొప్పలు చెప్పు కుంటున్న నాయకులు యాజమాన్యానికి, అధికారులకు తోత్తులు గా వ్యవహరిస్తున్నారని, ఆయన దుయ్యబట్టారు. ఓ వైపు కార్మిక మరణంతో విషాదం నెలకొనగా జిఎం ఇతర అధికారులు ముగ్గుల పోటీలతో తరిస్తున్నారని, కార్మికులకు పై వారికున్న చిత్తశుద్ధిని ఈ ఘటన తెలియజేస్తుందన్నారు. ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు.

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైన బీద రవిచంద్ర కి శుభాకాంక్షలు తెలియజేసిన చెరుకూరి వెంకటాద్రి..

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి