మన న్యూస్: పినపాక నియోజకవర్గం, మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన అశ్వాపురంపాడు గ్రామంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో నిర్మించిన ప్రైమరీ పాఠశాల ను సోమవారం ఎంఈఓ గడ్డం మంజుల,ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్ఐ రాజేందర్ ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చెసి ప్రారంబించారు. అనంతరం విద్యార్థులకు కాటన్ బ్యాగ్స్,పలకలు,నోట్ బుక్స్,పెన్నులు,పెన్సిల్ తదితర వస్తువులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో రామన్ శక్తి పౌండేషన్ ప్రతినిధులు హేమలత, దినేష్ ,ఆధార్ స్వచ్చంద సంస్థ సభ్యులు బట్టా.బిక్షపతి వాలెంటిర్స్ కుంజ రాము, పొడియం.సునీత, ఈసం రాజబాబు, పోలీస్ సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *