బొడ్డపాడు లో స్కూల్ బిల్డింగ్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

మన న్యూస్ పాచిపెంట డిసెంబర్9: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోబొడ్డపాడు గిరిజన బడి పిల్లలకు స్కూలు బిల్డింగు నిర్మాణము వెంటనే చేపట్టి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని నిరసన కార్యక్రమం పాఠశాల పిల్లలు వారి తల్లిదండ్రులతో చేయడం జరిగింది. స్థానిక గిరిజనులైన. పోయ్ శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ విద్యారంగం పట్ల ప్రభుత్వాలునిర్లక్ష్యం కారణంగా పిల్లలకు చదువుకు దూరం అవుతున్నారని స్కూల్ బిల్డింగు నిర్మాణం చేపట్టి గిరిజన ప్రాంతంలో మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడు గిరిజన గ్రామంలో చదువుకున్న పిల్లలకు గ్రామంలో సొంతంగా నిర్మించుకున్న చిన్నపాటి పాక లో చదువు చెప్తున్నారని ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వెంటనే స్కూలు బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని అన్నారు జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పీవోలు ఆదేశాలు జారీ చేసి ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో విద్యారంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టే విధంగా ప్రభుత్వంపై నివేదికలు పంపాలని అన్నారు ముఖ్యంగా ఏజెన్సీ గిరిజన హిల్ టాప్ గ్రామాల్లో నేటికీ భూత వైద్యం చెల్లింగు చేతబడులు పేరుతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వైద్యం పట్ల కూడా అవగాహనలేదని దీనంతటికీ కారణం చదువు లేకపోవడమే చిన్న వయసులో బాల్యవవాహాలు దీని కారణంగా రక్తహీనత వంటి జబ్బులతో మరణాలకు దగ్గరవుతున్నారని అధికారులు యుద్ధ ప్రాతిపదికన శ్రద్ధ వహించి బొడ్డపాడు గిరిజన గ్రామం వద్ద బడి పిల్లలకు స్కూలు బిల్డింగు శాంక్షన్ సేవించి వెంటనే నిర్మాణం చేపట్టాలని కోరారు ఏజెన్సీ గిరిజన గ్రామాలపై శ్రద్ధ వహించకపోతే భవిష్యత్ పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని అన్నారు. పోయి శ్రీరామ్ ఎస్ ఆదయ్య మాట్లాడుతూ స్కూలు బిల్డింగ్ నిర్మాణం వెంటనే చేపట్టి మా ప్రాంతం గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని కోరారు.

  • Related Posts

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం