పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు బాధిత కుటుంబాలను చూసి విచారం వ్యక్తం చేశారు.బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ముగ్గురికి 30 వేలు,పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబానికి రూ.5 వేలు మొత్తం 35 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఈ సందర్బంగా ఆమె భరోసా ఇచ్చారు.పల్లె ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ దిశగా జనసైనికులు చర్యలు చేపట్టాలని బార్లపూడి క్రాంతి సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నివారణ దిశగా చర్యలు చేపట్టే విధంగా చూడాలని,ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా క్రాంతి అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సూర్నీడి సురేష్ కుమార్,బోసు రాజు,ఉలవల నాని,నల్లల రామకృష్ణ ,బుజ్జి,కర్రి జయబాబు,సత్యంశెట్టి రాజేష్,మాగాపు రాజా తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:నిరుపేదల అనారోగ్యానికి భరోసాగా సీఎం సహాయనిది సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు,రాచపల్లి,పోతులూరు, కత్తిపూడి,కొంతంగి కొత్తూరు గ్రామాల లబ్ధిదారులకి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా రూ.24,50,339 విలువైన చెక్కులను శనివారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం