కలిగిరి శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి బాలాలయ ప్రవేశం,కళాపకర్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్,,!!

కలిగిరి డిసెంబర్ 1 మన ధ్యాస న్యూస్ (నాగరాజు కె)

కలిగిరి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో బాలాలయ ప్రవేశం (కళాపకర్షణ) కార్యక్రమం భక్తి భరిత వాతావరణంలో ఎంతో వైభవంగా నిర్వహించబడింది.దేవాలయం ప్రాంగణమంతా వేదమంత్రోచ్ఛారణలు,నాదస్వర ధ్వనులు, మంగళభేరి నినాదాలతో కళకళలాడింది. స్థానిక భక్తులు,గ్రామ పెద్దలు, మహిళలు,యువకులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రజలకు అండగా నిలుస్తూ, సేవాభావంతో ముందుకు సాగే మన ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కలిగిరి గ్రామానికి విచ్చేసి స్వామివారి బాలాలయ ప్రవేశాన్ని ప్రత్యక్షంగా దర్శించి,ప్రత్యేక పూజలకు హాజరై, తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఎమ్మెల్యే కాకర్ల రాకతో కార్యక్రమానికి మరింత శోభ పెరిగింది.స్థానిక ప్రజలు ప్రేమాభిమానాలతో స్వాగతం పలికారు గ్రామాభివృద్ధి, దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలపై ఆయన అభిప్రాయాలు తెలియజేసి, భక్తుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు.ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ నాయకులు,మండల ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు,మహిళామండలి,యువసేవా సంఘాలు మరియు ప్రాంతీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందే భాగ్యాన్ని సొంతం చేసుకున్నారు

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం