దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా*

జలదంకి, నవంబర్ 30,మనద్యాస న్యూస్,(కె నాగరాజు)

దిత్వా తుఫాను హెచ్చరికలు నేపథ్యంలో జలదంకి మండల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని… జలదంకి పోలీస్ శాఖ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కునేందుకు సంసిద్ధంగా ఉందని జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా తెలిపారు..మండలంలోని చామదల, కమ్మవారిపాలెం, సోమవరప్పాడు, గోపన్నపాలెం, టంకం వారి పాలెం, గ్రామాల వద్ద ఉన్న సప్తాలపై నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.. వాగులు, వంకలు, కాలువలు ఉన్న పరిసర గ్రామ ప్రజలు చేపల వేటకు, సరదాగా ఈత కొట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.. నీటి ప్రవాహం ఉన్న వాగుల సప్తాలపై ప్రయాణించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు..తుఫాను దృష్ట్యా అధికారులు సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. మండల పరిధిలో ప్రతి గ్రామంలో చిన్నపిల్లలను, బడి ఈడు పిల్లలను నీటి గుంటల దగ్గరికి వెళ్ళనివ్వకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ప్రతి గ్రామంలో చెరువులు నీటి గుంటలు నిండుగా నీటితో ఉన్నాయి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు. దిత్వా తుఫాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్లను వదిలి బయటకు రావద్దని ఎస్సై లతీ ఫున్నిసా కోరారు..

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం