నాణ్యతమైన విద్యను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రాష్ట్ర ఎక్సైజ్ &పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నాణ్యతమైన విద్యను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రాష్ట్ర ఎక్సైజ్ &పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలోని ఎల్లమ్మ బండల దెగ్గర యంగ్ ఇండియా
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు లతో కలసి భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియతో మాట్లాడుతూ ..
రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉపాధి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నెలకొల్పుతున్నట్లు తెలిపారు.. పేద విద్యార్థులకు ఇది వరం లాంటిదని, పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలనే మంచి ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మరియు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలియజేశారు.విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.. కామారెడ్డి జిల్లాలో మొదటగా జుక్కల్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తాపత్రయం, కృషిని మంత్రి అభినందించారు..ఉన్నత విద్యావంతుడు అయిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు..ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు..

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

    బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    సంజోష్ తగరం హీరోగా పరిచయం అవుతున్న ‘మై లవ్’ చిత్రం ఘనంగా ప్రారంభం

    దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

    దారి ఇవ్వలేదని ఎస్టీ వ్యక్తిపై కుల దూషణ, దాడి: మాజీ సర్పంచ్‌ బోధపాటి గోవిందప్ప పై కేసు నమోదు చేయాలని బాధితుడి డిమాండ్

    కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్

    కామాలూరుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్