మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నాణ్యతమైన విద్యను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రాష్ట్ర ఎక్సైజ్ &పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలోని ఎల్లమ్మ బండల దెగ్గర యంగ్ ఇండియా
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు లతో కలసి భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియతో మాట్లాడుతూ ..
రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉపాధి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నెలకొల్పుతున్నట్లు తెలిపారు.. పేద విద్యార్థులకు ఇది వరం లాంటిదని, పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలనే మంచి ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మరియు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలియజేశారు.విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.. కామారెడ్డి జిల్లాలో మొదటగా జుక్కల్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తాపత్రయం, కృషిని మంత్రి అభినందించారు..ఉన్నత విద్యావంతుడు అయిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు..ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు..