రోడ్డు ప్రమాదంలో గాయపడిన మేఘనను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దూబగుంట దుర్ఘటన బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాకర్ల సురేష్..మృతుల కుటుంబానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున 1లక్ష రూపాయలు ఆర్థిక సహాయం..గాయపడిన పాపకు కోలుకునే వరకు నెలవారీ 5 వేలు సహాయం — ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి,దూబగుంట అక్టోబర్ 25 :(మన ధ్యాస న్యూస్)://

ఇటీవల జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి చవలమూడి మేఘనను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పరామర్శించారు. శనివారం రాత్రి ఆయన స్వయంగా మేఘన స్వగ్రామమైన కలిగిరి మండలం, దూబగుంట గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఆమె నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, మేఘన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ దుర్ఘటనలో దూబగుంట గ్రామానికి చెందిన చవలమూడి బాబు (34), మమత (27), మరియు వారి కుమార్తె వైభ (8) దురదృష్టవశాత్తు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో కుమార్తె మేఘన తీవ్రంగా గాయపడి నెల్లూరు లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యులు ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని వెల్లడించగా, ప్రస్తుతం గ్రామానికి తీసుకువచ్చి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటోంది.ఈ విషయం తెలిసిన వెంటనే, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వ్యక్తిగతంగా అక్కడికి వెళ్లి పాపను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబానికి తగిన ఆర్థిక భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం,అందజేస్తున్నట్టు, అలాగే పాప పూర్తిగా కోలుకునే వరకు ప్రతి నెలా రూ.5,000 సహాయం అందజేస్తామని తెలిపారు.అంతేకాకుండా ప్రమాదానికి కారణమైన బోర్ వెల్స్ లారీ యజమాని ద్వారా ఇన్సూరెన్స్ క్లైమ్ ప్రాసెస్ చేసి, కుటుంబానికి తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాప మేఘనను జాగ్రత్తగా చూసుకోవాలని బంధువులకు సూచిస్తూ, ఆమె ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?